Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 03:41 AM

ఎన్నికల నిర్వహణలో ఆర్‌.ఓలు, ఏఆర్‌.ఓల పాత్ర కీలకం : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ఎన్నికల నిర్వహణలో ఆర్‌.ఓలు, ఏఆర్‌.ఓల పాత్ర కీలకం : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ఎన్నికల నిర్వహణలో ఆర్‌.ఓలు, ఏఆర్‌.ఓల పాత్ర కీలకం : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
February 03, 2026 03:58 PM 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు (ఆర్‌.ఓలు), సహాయ రిటర్నింగ్ అధికారులు (ఏఆర్‌.ఓలు) కీలక బాధ్యతలు నిర్వహిస్తారని, ఎన్నికల నియమ నిబంధనలపై సంపూర్ణ అవగాహనతో విధులు నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు.మంగళవారం భువనగిరి మున్సిపాలిటీలో పీఓలు, ఏపీఓలకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.ఎన్నికల ప్రక్రియలో భాగంగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో అందించే పోలింగ్ మెటీరియల్, బ్యాలెట్ బాక్సులు, ప్రిసైడింగ్ అధికారుల డైరీ, బ్యాలెట్ పేపర్ అకౌంటు నిర్వహణ, ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను తెరవడం వంటి అంశాలపై పీఓలు, ఏపీఓలు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలింగ్ మెటీరియల్‌ను ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా పరిశీలించాలని, ముఖ్యంగా బ్యాలెట్ పేపర్ల విషయంలో అత్యంత జాగ్రత్త వహించాలని సూచించారు.

ఆర్‌.ఓలు తమ బృందంలోని ఎన్నికల సిబ్బందికి ఎన్నికల నియమ నిబంధనలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని, విధుల నిర్వహణలో సమన్వయం కీలకమని తెలిపారు. అలాగే ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని టీ–పోల్ యాప్లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామలింగం, పీఓలు, ఏపీఓలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News