Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 12:42 PM

ఎన్నికల నిర్వహణలో ఆర్‌.ఓలు, ఏఆర్‌.ఓల పాత్ర కీలకం : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ఎన్నికల నిర్వహణలో ఆర్‌.ఓలు, ఏఆర్‌.ఓల పాత్ర కీలకం : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ఎన్నికల నిర్వహణలో ఆర్‌.ఓలు, ఏఆర్‌.ఓల పాత్ర కీలకం : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
03-02-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు (ఆర్‌.ఓలు), సహాయ రిటర్నింగ్ అధికారులు (ఏఆర్‌.ఓలు) కీలక బాధ్యతలు నిర్వహిస్తారని, ఎన్నికల నియమ నిబంధనలపై సంపూర్ణ అవగాహనతో విధులు నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు.మంగళవారం భువనగిరి మున్సిపాలిటీలో పీఓలు, ఏపీఓలకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.ఎన్నికల ప్రక్రియలో భాగంగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో అందించే పోలింగ్ మెటీరియల్, బ్యాలెట్ బాక్సులు, ప్రిసైడింగ్ అధికారుల డైరీ, బ్యాలెట్ పేపర్ అకౌంటు నిర్వహణ, ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను తెరవడం వంటి అంశాలపై పీఓలు, ఏపీఓలు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలింగ్ మెటీరియల్‌ను ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా పరిశీలించాలని, ముఖ్యంగా బ్యాలెట్ పేపర్ల విషయంలో అత్యంత జాగ్రత్త వహించాలని సూచించారు.

ఆర్‌.ఓలు తమ బృందంలోని ఎన్నికల సిబ్బందికి ఎన్నికల నియమ నిబంధనలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని, విధుల నిర్వహణలో సమన్వయం కీలకమని తెలిపారు. అలాగే ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని టీ–పోల్ యాప్లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామలింగం, పీఓలు, ఏపీఓలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ఎన్నికల నిర్వహణలో ఆర్‌.ఓలు, ఏఆర్‌.ఓల పాత్ర కీలకం : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

Article Image

ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు (ఆర్‌.ఓలు), సహాయ రిటర్నింగ్ అధికారులు (ఏఆర్‌.ఓలు) కీలక బాధ్యతలు నిర్వహిస్తారని, ఎన్నికల నియమ నిబంధనలపై సంపూర్ణ అవగాహనతో విధులు నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు.మంగళవారం భువనగిరి మున్సిపాలిటీలో పీఓలు, ఏపీఓలకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.ఎన్నికల ప్రక్రియలో భాగంగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో అందించే పోలింగ్ మెటీరియల్, బ్యాలెట్ బాక్సులు, ప్రిసైడింగ్ అధికారుల డైరీ, బ్యాలెట్ పేపర్ అకౌంటు నిర్వహణ, ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను తెరవడం వంటి అంశాలపై పీఓలు, ఏపీఓలు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలింగ్ మెటీరియల్‌ను ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా పరిశీలించాలని, ముఖ్యంగా బ్యాలెట్ పేపర్ల విషయంలో అత్యంత జాగ్రత్త వహించాలని సూచించారు.

ఆర్‌.ఓలు తమ బృందంలోని ఎన్నికల సిబ్బందికి ఎన్నికల నియమ నిబంధనలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని, విధుల నిర్వహణలో సమన్వయం కీలకమని తెలిపారు. అలాగే ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని టీ–పోల్ యాప్లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామలింగం, పీఓలు, ఏపీఓలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News