జిల్లా కలెక్టర్ హనుమంతరావు
యాదాద్రి భువనగిరి:స్థానికం ప్రధాన ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ను జనవరి 27న విడుదల చేసిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు.ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి గురువారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం, ఉద్యోగవాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా ప్రజలు గమనించి, వివిధ సమస్యలపై అర్జీలు అందజేయడానికి కలెక్టరేట్కు రావద్దని కోరారు.ఎన్నికల నిర్వహణలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి