Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 01:53 AM

ఎన్‌జీ కళాశాల అధ్యాపకురాలు స్రవంతికి డాక్టరేట్

ఎన్‌జీ కళాశాల అధ్యాపకురాలు స్రవంతికి డాక్టరేట్

ఎన్‌జీ కళాశాల అధ్యాపకురాలు స్రవంతికి డాక్టరేట్
February 03, 2026 04:39 PM 19 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

నాగార్జున ప్రభుత్వ కళాశాల ఆంగ్ల విభాగంలో ఒప్పంద అధ్యాపకురాలిగా పనిచేస్తున్న స్రవంతి మద్దెలకు రాజస్థాన్‌కు చెందిన శ్రీ జగదీశ్ ప్రసాద్ జబర్మల్ తిబ్రేవాలా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ వెల్లడించారు.డా. అనూష్ శర్మ పర్యవేక్షణలో “ఎ క్రిటికల్ అనాలిసిస్ ఆఫ్ ఐడియాలాజీ అండ్ ఫెమినిజం ఇన్ ది వర్క్స్ ఆఫ్ సరోజినీ నాయుడు, అరుంధతి రాయ్, ప్రేమ్‌చంద్ అండ్ యష్పాల్” అనే అంశంపై స్రవంతి పరిశోధన పూర్తి చేయగా, విశ్వవిద్యాలయం ఆమెకు డాక్టరేట్ ప్రదానం చేసినట్లు తెలిపారు.

డాక్టరేట్ సాధించిన స్రవంతిని వైస్ ప్రిన్సిపాళ్లు డా. రవికుమార్, డా. అంతటి శ్రీనివాస్, పరీక్షల నియంత్రణాధికారి డా. మునిస్వామి, విద్యాత్మక సమన్వయకర్త బత్తిని నాగరాజు, ఆంగ్ల విభాగాధ్యక్షుడు డా. వై.వి.ఆర్. ప్రసన్నకుమార్, తెలుగు శాఖాధ్యక్షుడు డా. వెల్దండి శ్రీధర్, జంతుశాస్త్ర విభాగాధ్యక్షురాలు డా. జ్యోత్స్నతో పాటు అధ్యాపకులు డా. జి. భాగ్యలక్ష్మి, డా. ఎ. మల్లేశం, సరిత, వెంకట్, హరికృష్ణ, వేణు తదితరులు అభినందనలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News