ఎన్జీ కళాశాల అధ్యాపకురాలికి డాక్టరేట్
ఎన్జీ కళాశాల అధ్యాపకురాలికి డాక్టరేట్
స్థానికం బృందం
నాగార్జున ప్రభుత్వ కళాశాల జంతుశాస్త్ర విభాగంలో ఒప్పంద అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తున్న మహేశ్వరి మద్దెలకు డాక్టరేట్ లభించింది. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన శ్రీ జగదీశ్ ప్రసాద్ జబర్మల్ తిబ్రేవాలా విశ్వవిద్యాలయం ఆమెకు డాక్టరేట్ ప్రదానం చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ వెల్లడించారు.
డాక్టర్ ఇమ్రాన్ ఖాన్ పర్యవేక్షణలో “జల కీటకాలు – పర్యావరణ ప్రయోజనాలపై అధ్యయనం” అనే అంశంపై మహేశ్వరి పరిశోధన నిర్వహించారు. ఈ పరిశోధనకు గాను విశ్వవిద్యాలయం ఆమెకు డాక్టరేట్ ప్రదానం చేసిందని తెలిపారు.
ఈ సందర్భంగా కళాశాల వైస్ మున్సిపల్ర్ డాక్టర్ రవికుమార్, డాక్టర్ అంతటి శ్రీనివాస్, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ముని స్వామి, విద్యాత్మక సమన్వయకర్త బత్తిని నాగరాజు, తెలుగు శాఖ అధ్యక్షుడు డాక్టర్ వెల్దండి శ్రీధర్, జంతుశాస్త్ర విభాగం అధ్యక్షురాలు డాక్టర్ జ్యోత్స్నతో పాటు అధ్యాపకులు డాక్టర్ జి. భాగ్యలక్ష్మి, డాక్టర్ ఎ. మల్లేశం, సరిత, స్రవంతి, వెంకట్ శివరాణి, శిరీష తదితరులు మహేశ్వరిని అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి