Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:53 AM

ఎన్ఎస్ఎస్ శిబిరంలో అవగాహన ర్యాలీ – సావిత్రిబాయి పూలే జయంతి

ఎన్ఎస్ఎస్ శిబిరంలో అవగాహన ర్యాలీ – సావిత్రిబాయి పూలే జయంతి

ఎన్ఎస్ఎస్ శిబిరంలో అవగాహన ర్యాలీ – సావిత్రిబాయి పూలే జయంతి
January 03, 2026 08:48 PM 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
హైదరాబాద్ స్థానికం ప్రతినిధి

ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్ ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో పసుమాముల, కళానగర్ గ్రామాల్లో కొనసాగుతున్న శీతాకాల ప్రత్యేక శిబిరం రెండో రోజున పరిసరాల పరిశుభ్రత, చెట్ల పెంపకం, నీటి పొదుపు, రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీతో పాటు సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

శిబిరం రెండో రోజులో భాగంగా శుక్రవారం ఉదయం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పసుమాముల, కళానగర్ గ్రామ వీధుల్లో పరిసరాల పరిశుభ్రత, చెట్ల సంరక్షణ, నీటి వృథా నివారణ, రోడ్డు భద్రత వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు, నినాదాలతో గ్రామస్తులను చైతన్యపరిచారు.మధ్యాహ్నం ప్రాథమిక పాఠశాల ఆవరణలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల వైస్‌ప్రిన్సిపాల్ శ్రీమతి ఇందిరా హాజరై మాట్లాడుతూ, అప్పటి సామాజిక కట్టుబాట్లను ధైర్యంగా అధిగమించి విద్యను అభ్యసించి, పేద వర్గాలకు విద్య వెలుగులు అందించిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఆమె జీవితం విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని, ఆ ఆదర్శాలతో జీవితాలను తీర్చిదిద్దుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మహిళా సాధికారికత విభాగం కోఆర్డినేటర్ డా. అపర్ణ చతుర్వేది, కళాశాల అధ్యాపకులు ప్రొఫెసర్ నాగేంద్ర, డా. పి. రమాదేవి, డా. గీతా నాయక్, డా. కె. అనిత, ఐక్యూఏసి కోఆర్డినేటర్ డా. డి. మధు, డా. వి. శేఖర్, డా. బాల నరసింహ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డా. ఇ. యాదగిరి రెడ్డి, డా. ఎస్. శారదా దేవి తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News