ఎన్ జి కళాశాలలో రేపు జాతీయ స్థాయి తెలుగు భాషా సదస్సు
ఎన్ జి కళాశాలలో రేపు జాతీయ స్థాయి తెలుగు భాషా సదస్సు
స్థానికం బృందం
స్థానికం ప్రధాన ప్రతినిధి
కాలానుగుణంగా మారుతున్న తెలుగు భాషా స్వరూపంపై రేపు నల్గొండ పట్టణం వేదిక కానుంది. నాగార్జున ప్రభుత్వ కళాశాలలో తెలుగు భాషా వికాసంపై జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నారు.కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో, ప్రాచీన తెలుగు భాషా విశిష్ట అధ్యయన కేంద్రం నెల్లూరు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ఈ నెల 30వ తేదీన “తెలుగు భాషా వికాసంలో వివిధ వైఖరులు” అనే అంశంపై ఒక రోజు పాటు ఈ సదస్సు జరగనుంది.ఈ సదస్సులో ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక మాధ్యమాల వరకు తెలుగు భాష సాగిన ప్రయాణం, భాష వినియోగంలో వచ్చిన మార్పులు, ఎదురవుతున్న సవాళ్లపై లోతైన చర్చ జరగనుంది. తెలుగు భాషా పరిణామ క్రమం, చారిత్రక దృక్పథాలు, ఆధునిక సాహిత్యంలో కొత్త ధోరణులు, మాధ్యమాల ప్రభావం, బోధనా రంగంలో తెలుగు అమలుపై పరిశోధనా పత్రాలు ప్రవేశపెట్టనున్నారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలోని కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాల నుంచి ప్రముఖ ఆచార్యులు, భాషావేత్తలు, పరిశోధకులు, అధ్యాపకులు ఈ సదస్సులో పాల్గొననున్నారు.తెలుగు భాషా పరిరక్షణకు, భవిష్యత్ వికాసానికి ఈ సదస్సు దిశానిర్దేశం చేస్తుందని కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్, సదస్సు సంచాలకులు డా. వెల్దండి శ్రీధర్ తెలిపారు. భాషాభిమానులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి