Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:43 AM

ఎన్ జి కళాశాలలో రేపు జాతీయ స్థాయి తెలుగు భాషా సదస్సు

ఎన్ జి కళాశాలలో రేపు జాతీయ స్థాయి తెలుగు భాషా సదస్సు

ఎన్ జి కళాశాలలో రేపు జాతీయ స్థాయి తెలుగు భాషా సదస్సు
January 28, 2026 05:28 PM 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

కాలానుగుణంగా మారుతున్న తెలుగు భాషా స్వరూపంపై రేపు నల్గొండ పట్టణం వేదిక కానుంది. నాగార్జున ప్రభుత్వ కళాశాలలో తెలుగు భాషా వికాసంపై జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నారు.కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో, ప్రాచీన తెలుగు భాషా విశిష్ట అధ్యయన కేంద్రం నెల్లూరు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ఈ నెల 30వ తేదీన “తెలుగు భాషా వికాసంలో వివిధ వైఖరులు” అనే అంశంపై ఒక రోజు పాటు ఈ సదస్సు జరగనుంది.ఈ సదస్సులో ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక మాధ్యమాల వరకు తెలుగు భాష సాగిన ప్రయాణం, భాష వినియోగంలో వచ్చిన మార్పులు, ఎదురవుతున్న సవాళ్లపై లోతైన చర్చ జరగనుంది. తెలుగు భాషా పరిణామ క్రమం, చారిత్రక దృక్పథాలు, ఆధునిక సాహిత్యంలో కొత్త ధోరణులు, మాధ్యమాల ప్రభావం, బోధనా రంగంలో తెలుగు అమలుపై పరిశోధనా పత్రాలు ప్రవేశపెట్టనున్నారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలోని కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాల నుంచి ప్రముఖ ఆచార్యులు, భాషావేత్తలు, పరిశోధకులు, అధ్యాపకులు ఈ సదస్సులో పాల్గొననున్నారు.తెలుగు భాషా పరిరక్షణకు, భవిష్యత్ వికాసానికి ఈ సదస్సు దిశానిర్దేశం చేస్తుందని కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్, సదస్సు సంచాలకులు డా. వెల్దండి శ్రీధర్ తెలిపారు. భాషాభిమానులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News