Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 09:43 PM

ఎన్ జి కళాశాలలో రేపు జాతీయ స్థాయి తెలుగు భాషా సదస్సు

ఎన్ జి కళాశాలలో రేపు జాతీయ స్థాయి తెలుగు భాషా సదస్సు

ఎన్ జి కళాశాలలో రేపు జాతీయ స్థాయి తెలుగు భాషా సదస్సు
28-01-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

కాలానుగుణంగా మారుతున్న తెలుగు భాషా స్వరూపంపై రేపు నల్గొండ పట్టణం వేదిక కానుంది. నాగార్జున ప్రభుత్వ కళాశాలలో తెలుగు భాషా వికాసంపై జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నారు.కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో, ప్రాచీన తెలుగు భాషా విశిష్ట అధ్యయన కేంద్రం నెల్లూరు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ఈ నెల 30వ తేదీన “తెలుగు భాషా వికాసంలో వివిధ వైఖరులు” అనే అంశంపై ఒక రోజు పాటు ఈ సదస్సు జరగనుంది.ఈ సదస్సులో ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక మాధ్యమాల వరకు తెలుగు భాష సాగిన ప్రయాణం, భాష వినియోగంలో వచ్చిన మార్పులు, ఎదురవుతున్న సవాళ్లపై లోతైన చర్చ జరగనుంది. తెలుగు భాషా పరిణామ క్రమం, చారిత్రక దృక్పథాలు, ఆధునిక సాహిత్యంలో కొత్త ధోరణులు, మాధ్యమాల ప్రభావం, బోధనా రంగంలో తెలుగు అమలుపై పరిశోధనా పత్రాలు ప్రవేశపెట్టనున్నారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలోని కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాల నుంచి ప్రముఖ ఆచార్యులు, భాషావేత్తలు, పరిశోధకులు, అధ్యాపకులు ఈ సదస్సులో పాల్గొననున్నారు.తెలుగు భాషా పరిరక్షణకు, భవిష్యత్ వికాసానికి ఈ సదస్సు దిశానిర్దేశం చేస్తుందని కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్, సదస్సు సంచాలకులు డా. వెల్దండి శ్రీధర్ తెలిపారు. భాషాభిమానులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు.

Sthanikam

ఎన్ జి కళాశాలలో రేపు జాతీయ స్థాయి తెలుగు భాషా సదస్సు

Article Image
స్థానికం ప్రధాన ప్రతినిధి

కాలానుగుణంగా మారుతున్న తెలుగు భాషా స్వరూపంపై రేపు నల్గొండ పట్టణం వేదిక కానుంది. నాగార్జున ప్రభుత్వ కళాశాలలో తెలుగు భాషా వికాసంపై జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నారు.కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో, ప్రాచీన తెలుగు భాషా విశిష్ట అధ్యయన కేంద్రం నెల్లూరు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ఈ నెల 30వ తేదీన “తెలుగు భాషా వికాసంలో వివిధ వైఖరులు” అనే అంశంపై ఒక రోజు పాటు ఈ సదస్సు జరగనుంది.ఈ సదస్సులో ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక మాధ్యమాల వరకు తెలుగు భాష సాగిన ప్రయాణం, భాష వినియోగంలో వచ్చిన మార్పులు, ఎదురవుతున్న సవాళ్లపై లోతైన చర్చ జరగనుంది. తెలుగు భాషా పరిణామ క్రమం, చారిత్రక దృక్పథాలు, ఆధునిక సాహిత్యంలో కొత్త ధోరణులు, మాధ్యమాల ప్రభావం, బోధనా రంగంలో తెలుగు అమలుపై పరిశోధనా పత్రాలు ప్రవేశపెట్టనున్నారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలోని కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాల నుంచి ప్రముఖ ఆచార్యులు, భాషావేత్తలు, పరిశోధకులు, అధ్యాపకులు ఈ సదస్సులో పాల్గొననున్నారు.తెలుగు భాషా పరిరక్షణకు, భవిష్యత్ వికాసానికి ఈ సదస్సు దిశానిర్దేశం చేస్తుందని కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్, సదస్సు సంచాలకులు డా. వెల్దండి శ్రీధర్ తెలిపారు. భాషాభిమానులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News