ఏలూరులో రాష్ట్ర స్థాయి అబాకస్ & వేదిక్ మాథ్స్ పోటీల్లో అదిరిపోయిన విజయం!
ఏలూరులో రాష్ట్ర స్థాయి అబాకస్ & వేదిక్ మాథ్స్ పోటీల్లో అదిరిపోయిన విజయం!
GADDAM JAGANMOHAN REDDY
చిన్నంపేట సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రతిభకు రాష్ట్ర స్థాయి ప్రశంసలు
ఏలూరులో ఘనంగా నిర్వహించిన స్టేట్ లెవెల్ అబాకస్ అండ్ వేదిక్ మాథ్స్ పోటీల్లో చాట్రాయి మండలం చిన్నంపేట సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పాఠశాలకు కీర్తి తేవడం గర్వకారణంగా నిలిచింది.
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ పోటీల్లో మాణికుల భవిష్య, చీపు వర్షిని, తేళ్ళూరి శ్రేష్ట లేఖన, డొంకిన భాను తేజ, ఘంటసాల గీత సిరివల్లి, అబ్బ దాసరి లేఖన తమ అసాధారణ మేధస్సుతో ప్రతిష్టాత్మక బహుమతులు సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. కఠినమైన ప్రశ్నలకు వేగంగా, ఖచ్చితంగా సమాధానాలు ఇచ్చి తమ ప్రతిభను చాటారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్ పలగాని శ్రీనివాసరావు మాట్లాడుతూ,
“మన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మెరిసి విజేతలుగా నిలవడం ఎంతో గర్వంగా ఉంది. గణితంలో పట్టు, క్రమశిక్షణతో సాధన, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయి. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో కూడా మన విద్యార్థులు సత్తా చాటేలా ప్రత్యేక శిక్షణ అందిస్తాం” అని పేర్కొన్నారు.
విద్యార్థుల విజయంతో చిన్నంపేట గ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విజేతలను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి