Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 03:42 AM

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతికి కారణమైన గంజాయి స్మగ్లర్లను కఠినంగా శిక్షించాలి

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతికి కారణమైన గంజాయి స్మగ్లర్లను కఠినంగా శిక్షించాలి

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతికి కారణమైన గంజాయి స్మగ్లర్లను కఠినంగా శిక్షించాలి
February 03, 2026 05:34 PM 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్

గంజాయి స్మగ్లర్ల దాడిలో అసువులు బాసిన నిజామాబాద్ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతికి కారణమైన గంజాయి స్మగ్లర్లను కఠినంగా శిక్షించాలని డివైఎఫ్ఐ డిమాండ్ చేసింది.


ఈ మేరకు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పట్టణంలోని సుభాష్ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ మాట్లాడుతూ,

జనవరి 23న గంజాయి సరఫరా జరుగుతోందన్న సమాచారం మేరకు నిజామాబాద్ శివారులోని మాధవ నగర్ వద్ద ఎక్సైజ్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారని తెలిపారు. ఈ క్రమంలో ఎక్సైజ్ పోలీసులను చూసిన గంజాయి స్మగ్లింగ్ ముఠా సభ్యులు పారిపోయేందుకు ప్రయత్నించారని, వారిని పట్టుకునే ప్రయత్నంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను గంజాయి ముఠా సభ్యులు తమ కారుతో ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడిందని పేర్కొన్నారు.

ఎనిమిది రోజులపాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ, విధి నిర్వహణలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ప్రాణాలు కోల్పోయిందని అన్నారు. ఆమె కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.పోలీసులకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో నగరాల నుంచీ గ్రామాల వరకు గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా విస్తరిస్తున్నాయని, ప్రభుత్వం మరియు పోలీసు అధికారులు నిరంతరం నిఘా పెట్టాలని సూచించారు.రెండు నెలల క్రితం చర్లపల్లిలో కెమికల్ కంపెనీ పేరుతో డ్రగ్స్ తయారు చేసి విదేశాలకు తరలిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చిందని గుర్తు చేశారు.రాష్ట్ర ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేక స్పెషల్ వింగ్స్ ఏర్పాటు చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే కానిస్టేబుల్ సౌమ్య మృతికి కారణమైన గంజాయి స్మగ్లర్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు మాదాసు రావణ్, గద్దపాటి రఘువరన్, నాగయ్య, అశోక్, శివ, ఆదిల్, తరుణ్, కార్తీక్, వేణు, నవీన్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News