Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:23 PM

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతికి కారణమైన గంజాయి స్మగ్లర్లను కఠినంగా శిక్షించాలి

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతికి కారణమైన గంజాయి స్మగ్లర్లను కఠినంగా శిక్షించాలి

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతికి కారణమైన గంజాయి స్మగ్లర్లను కఠినంగా శిక్షించాలి
February 03, 2026 05:34 PM 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్

గంజాయి స్మగ్లర్ల దాడిలో అసువులు బాసిన నిజామాబాద్ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతికి కారణమైన గంజాయి స్మగ్లర్లను కఠినంగా శిక్షించాలని డివైఎఫ్ఐ డిమాండ్ చేసింది.


ఈ మేరకు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పట్టణంలోని సుభాష్ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ మాట్లాడుతూ,

జనవరి 23న గంజాయి సరఫరా జరుగుతోందన్న సమాచారం మేరకు నిజామాబాద్ శివారులోని మాధవ నగర్ వద్ద ఎక్సైజ్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారని తెలిపారు. ఈ క్రమంలో ఎక్సైజ్ పోలీసులను చూసిన గంజాయి స్మగ్లింగ్ ముఠా సభ్యులు పారిపోయేందుకు ప్రయత్నించారని, వారిని పట్టుకునే ప్రయత్నంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను గంజాయి ముఠా సభ్యులు తమ కారుతో ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడిందని పేర్కొన్నారు.

ఎనిమిది రోజులపాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ, విధి నిర్వహణలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ప్రాణాలు కోల్పోయిందని అన్నారు. ఆమె కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.పోలీసులకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో నగరాల నుంచీ గ్రామాల వరకు గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా విస్తరిస్తున్నాయని, ప్రభుత్వం మరియు పోలీసు అధికారులు నిరంతరం నిఘా పెట్టాలని సూచించారు.రెండు నెలల క్రితం చర్లపల్లిలో కెమికల్ కంపెనీ పేరుతో డ్రగ్స్ తయారు చేసి విదేశాలకు తరలిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చిందని గుర్తు చేశారు.రాష్ట్ర ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేక స్పెషల్ వింగ్స్ ఏర్పాటు చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే కానిస్టేబుల్ సౌమ్య మృతికి కారణమైన గంజాయి స్మగ్లర్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు మాదాసు రావణ్, గద్దపాటి రఘువరన్, నాగయ్య, అశోక్, శివ, ఆదిల్, తరుణ్, కార్తీక్, వేణు, నవీన్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News