Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 05:37 AM

ఏపీ బెస్త సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్‌గా బెస్త రామాంజనేయులు అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం

ఏపీ బెస్త సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్‌గా బెస్త రామాంజనేయులు అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం

ఏపీ బెస్త సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్‌గా బెస్త రామాంజనేయులు అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం
January 06, 2026 05:25 AM 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రతినిధి
విజయవాడ గొల్లపూడిలోని బీసీ భవన్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఏపీ బెస్త సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్‌గా గౌ. బెస్త రామాంజనేయులు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. జలవనరులు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గౌ. సవితమ్మ సమక్షంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది.ఈ సందర్భంగా బెస్త రామాంజనేయులు మాట్లాడుతూ, రాష్ట్రంలో బెస్తలకు సముచిత ప్రాధాన్యం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యా–ఐటీ మంత్రి నారా లోకేష్, ఆదోని నియోజకవర్గ ఇంచార్జి కే. మీనాక్షి నాయుడులకు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో బెస్తల మత్స్యకార వృత్తిని దెబ్బతీసిన జీఓ 217ను కూటమి ప్రభుత్వం రద్దు చేయడం హర్షణీయమని పేర్కొన్నారు. బెస్తల అభ్యున్నతికి ప్రత్యేక బడ్జెట్ నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ బొమ్మన శ్రీధర్, హౌసింగ్ డైరెక్టర్ అరెకల్ రామకృష్ణ, సామాజిక వేత్త సాయి ఫణి, కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు, ఆదోని నియోజకవర్గానికి చెందిన బెస్త సంఘ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News