Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 09:15 AM

ఏపీ బెస్త సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్‌గా బెస్త రామాంజనేయులు అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం

ఏపీ బెస్త సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్‌గా బెస్త రామాంజనేయులు అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం

ఏపీ బెస్త సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్‌గా బెస్త రామాంజనేయులు అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం
January 06, 2026 05:25 AM 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రతినిధి
విజయవాడ గొల్లపూడిలోని బీసీ భవన్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఏపీ బెస్త సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్‌గా గౌ. బెస్త రామాంజనేయులు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. జలవనరులు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గౌ. సవితమ్మ సమక్షంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది.ఈ సందర్భంగా బెస్త రామాంజనేయులు మాట్లాడుతూ, రాష్ట్రంలో బెస్తలకు సముచిత ప్రాధాన్యం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యా–ఐటీ మంత్రి నారా లోకేష్, ఆదోని నియోజకవర్గ ఇంచార్జి కే. మీనాక్షి నాయుడులకు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో బెస్తల మత్స్యకార వృత్తిని దెబ్బతీసిన జీఓ 217ను కూటమి ప్రభుత్వం రద్దు చేయడం హర్షణీయమని పేర్కొన్నారు. బెస్తల అభ్యున్నతికి ప్రత్యేక బడ్జెట్ నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ బొమ్మన శ్రీధర్, హౌసింగ్ డైరెక్టర్ అరెకల్ రామకృష్ణ, సామాజిక వేత్త సాయి ఫణి, కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు, ఆదోని నియోజకవర్గానికి చెందిన బెస్త సంఘ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News