ఏకీకృత కుటుంబ సర్వేలో వేగం పెంచాలి ఇళ్ల వద్దే పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
ఏకీకృత కుటుంబ సర్వేలో వేగం పెంచాలి ఇళ్ల వద్దే పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
స్థానికం బృందం
స్థానికం ప్రధాన ప్రతినిధి
ఆదోని పట్టణంలో కొనసాగుతున్న ఏకీకృత కుటుంబ సర్వే పనుల తీరును జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, ఆదోని శాసనసభ్యులు పార్థసారథి బుధవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇంజనీర్స్ కాలనీలోని సుభద్రమ్మ నివాసానికి వెళ్లి, సర్వే నిర్వహణలో తీసుకుంటున్న విధానాలను సమీక్షించారుప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరాలంటే ఏకీకృత కుటుంబ సర్వేనే ఆధారం అని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా, ప్రతి ఇంటి వివరాలను సమగ్రంగా నమోదు చేస్తూ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.సర్వేలో ఒక్క కుటుంబం కూడా మిగలకూడదని, తప్పిదాలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా ప్రక్రియ సాగాలని ఎమ్మెల్యే పార్థసారథి సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు.
ఈ తనిఖీలో ఆదోని ఇంచార్జి సబ్ కలెక్టర్ అజయ్ కుమార్, తహసీల్దార్ శేషఫణి, మున్సిపల్ కమిషనర్ కృష్ణతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి