Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 12:39 PM

విద్యావిభాగంలో కె. ఉమాదేవికి డాక్టరేట్

విద్యావిభాగంలో కె. ఉమాదేవికి డాక్టరేట్

విద్యావిభాగంలో కె. ఉమాదేవికి డాక్టరేట్
02-02-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయం విద్యావిభాగంలో సహాయ అధ్యాపకురాలిగా విధులు నిర్వర్తిస్తున్న కె. ఉమాదేవి రాయలసీమ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ సాధించారు. “అభివృద్ధి లోపాలు గల పిల్లల సమగ్ర అభివృద్ధిపై ప్రారంభ దశలో చేపట్టే జోక్యాల ప్రభావం” అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది.

ఈ పరిశోధన ఆంగ్ల భాషల విశ్వవిద్యాలయం హైదరాబాద్‌కు చెందిన పదవీ విరమణ పొందిన ఆచార్యుడు డా. వి. సుధాకర్ మార్గదర్శకత్వంలో సాగింది. చిన్న వయసులోనే సమర్థవంతమైన సహాయక చర్యలు అందిస్తే అభివృద్ధి లోపాలు ఉన్న పిల్లల మానసిక, సామాజిక, భావోద్వేగ, విద్యా వికాసం గణనీయంగా మెరుగుపడుతుందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.బోధనా బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ అనేక అవరోధాలు ఎదుర్కొని ఈ పరిశోధనను విజయవంతంగా పూర్తి చేయడం అభినందనీయమని విద్యావేత్తలు ప్రశంసించారు. సమగ్ర విద్యా విధానాల రూపకల్పనకు, అభివృద్ధి లోపాలు గల పిల్లల అభ్యున్నతికి ఈ పరిశోధన దిశానిర్దేశకంగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.ఈ ఘన విజయానికి స్నేహితులు, బంధువులు, సహచరులు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. తన పరిశోధనా ప్రయాణంలో సహకరించిన ఆచార్యులు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు కె. ఉమాదేవి కృతజ్ఞతలు తెలిపారు

Sthanikam

విద్యావిభాగంలో కె. ఉమాదేవికి డాక్టరేట్

Article Image

డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయం విద్యావిభాగంలో సహాయ అధ్యాపకురాలిగా విధులు నిర్వర్తిస్తున్న కె. ఉమాదేవి రాయలసీమ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ సాధించారు. “అభివృద్ధి లోపాలు గల పిల్లల సమగ్ర అభివృద్ధిపై ప్రారంభ దశలో చేపట్టే జోక్యాల ప్రభావం” అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది.

ఈ పరిశోధన ఆంగ్ల భాషల విశ్వవిద్యాలయం హైదరాబాద్‌కు చెందిన పదవీ విరమణ పొందిన ఆచార్యుడు డా. వి. సుధాకర్ మార్గదర్శకత్వంలో సాగింది. చిన్న వయసులోనే సమర్థవంతమైన సహాయక చర్యలు అందిస్తే అభివృద్ధి లోపాలు ఉన్న పిల్లల మానసిక, సామాజిక, భావోద్వేగ, విద్యా వికాసం గణనీయంగా మెరుగుపడుతుందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.బోధనా బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ అనేక అవరోధాలు ఎదుర్కొని ఈ పరిశోధనను విజయవంతంగా పూర్తి చేయడం అభినందనీయమని విద్యావేత్తలు ప్రశంసించారు. సమగ్ర విద్యా విధానాల రూపకల్పనకు, అభివృద్ధి లోపాలు గల పిల్లల అభ్యున్నతికి ఈ పరిశోధన దిశానిర్దేశకంగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.ఈ ఘన విజయానికి స్నేహితులు, బంధువులు, సహచరులు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. తన పరిశోధనా ప్రయాణంలో సహకరించిన ఆచార్యులు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు కె. ఉమాదేవి కృతజ్ఞతలు తెలిపారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News