విద్యావిభాగంలో కె. ఉమాదేవికి డాక్టరేట్
విద్యావిభాగంలో కె. ఉమాదేవికి డాక్టరేట్
స్థానికం బృందం
డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయం విద్యావిభాగంలో సహాయ అధ్యాపకురాలిగా విధులు నిర్వర్తిస్తున్న కె. ఉమాదేవి రాయలసీమ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ సాధించారు. “అభివృద్ధి లోపాలు గల పిల్లల సమగ్ర అభివృద్ధిపై ప్రారంభ దశలో చేపట్టే జోక్యాల ప్రభావం” అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది.
ఈ పరిశోధన ఆంగ్ల భాషల విశ్వవిద్యాలయం హైదరాబాద్కు చెందిన పదవీ విరమణ పొందిన ఆచార్యుడు డా. వి. సుధాకర్ మార్గదర్శకత్వంలో సాగింది. చిన్న వయసులోనే సమర్థవంతమైన సహాయక చర్యలు అందిస్తే అభివృద్ధి లోపాలు ఉన్న పిల్లల మానసిక, సామాజిక, భావోద్వేగ, విద్యా వికాసం గణనీయంగా మెరుగుపడుతుందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.బోధనా బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ అనేక అవరోధాలు ఎదుర్కొని ఈ పరిశోధనను విజయవంతంగా పూర్తి చేయడం అభినందనీయమని విద్యావేత్తలు ప్రశంసించారు. సమగ్ర విద్యా విధానాల రూపకల్పనకు, అభివృద్ధి లోపాలు గల పిల్లల అభ్యున్నతికి ఈ పరిశోధన దిశానిర్దేశకంగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.ఈ ఘన విజయానికి స్నేహితులు, బంధువులు, సహచరులు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. తన పరిశోధనా ప్రయాణంలో సహకరించిన ఆచార్యులు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు కె. ఉమాదేవి కృతజ్ఞతలు తెలిపారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి