Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 05:27 AM

విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి

విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి

విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి
February 18, 2026 06:37 PM 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బడ్జెట్‌లో విద్యారంగానికి ₹50 వేల కోట్లు కేటాయించాలి

20న ధర్నా విజయవంతం చేయాలి: బీసీ విద్యార్థి సంఘం

నార్కెట్‌పల్లి, : రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.8,500 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ డిమాండ్ చేశారు. స్థానికంగా నిర్వహించిన విద్యార్థుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజ్యసభ సభ్యుడు ఆర్ . కృష్ణయ్య ఆధ్వర్యంలో ఈ నెల 20న చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

రానున్న 2026–27 బడ్జెట్‌లో విద్యారంగానికి రూ.50 వేల కోట్ల నిధులు కేటాయించి, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ చదువుతున్న విద్యార్థుల పూర్తి ఫీజులను ప్రభుత్వమే భరించాలని కోరారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో మెరుగైన వసతులు కల్పించాలని, అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, స్కాలర్షిప్‌లు ఆలస్యం చేయడం వల్ల పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని విమర్శించారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే ధర్నాలు, రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు.

సమావేశంలో ఎడ్ల మహాలింగం, కాబట్టి సత్తన్న, గోని మహేష్, గిరీష్ రెడ్డి, సురేందర్, యశ్వంత్, ఉపేందర్ రెడ్డి, సుహాస్ గౌడ్, మనీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News