విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి
విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి
స్థానికం బృందం
బడ్జెట్లో విద్యారంగానికి ₹50 వేల కోట్లు కేటాయించాలి
20న ధర్నా విజయవంతం చేయాలి: బీసీ విద్యార్థి సంఘం
నార్కెట్పల్లి, : రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న రూ.8,500 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ డిమాండ్ చేశారు. స్థానికంగా నిర్వహించిన విద్యార్థుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజ్యసభ సభ్యుడు ఆర్ . కృష్ణయ్య ఆధ్వర్యంలో ఈ నెల 20న చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
రానున్న 2026–27 బడ్జెట్లో విద్యారంగానికి రూ.50 వేల కోట్ల నిధులు కేటాయించి, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ చదువుతున్న విద్యార్థుల పూర్తి ఫీజులను ప్రభుత్వమే భరించాలని కోరారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో మెరుగైన వసతులు కల్పించాలని, అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, స్కాలర్షిప్లు ఆలస్యం చేయడం వల్ల పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని విమర్శించారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే ధర్నాలు, రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు.
సమావేశంలో ఎడ్ల మహాలింగం, కాబట్టి సత్తన్న, గోని మహేష్, గిరీష్ రెడ్డి, సురేందర్, యశ్వంత్, ఉపేందర్ రెడ్డి, సుహాస్ గౌడ్, మనీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి