విద్యార్థుల్లో దాగిన క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయాలి
విద్యార్థుల్లో దాగిన క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయాలి
స్థానికం బృందం
విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలని తెలంగాణ జనసమితి ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్చార్జ్, రాష్ట్ర నాయకులు కె.వి. రంగారెడ్డి అన్నారు.చైతన్యపురి ప్రాంతంలోని జీనియస్ గ్రామర్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన విమల మెమోరియల్ క్రీడా ఉత్సవం–2026ను శనివారం సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కె.వి. రంగారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి వార్షికక్రీడాఉత్సవాలుఎంతోఅవసరమన్నారు.విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీయడంలో పాఠశాలల పాత్ర కీలకమని పేర్కొన్నారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యం పెరుగుతుందని చెప్పారు. మన ప్రాంతం నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులు ఎదగాలంటే పాఠశాల యాజమాన్యాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు.క్రీడా స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ క్రీడా సంబరంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో జైహింద్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, అంకుశ రెడ్డి, తక్నీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి