విద్యను కార్పొరేటీకరణ వైపు నెట్టే కేంద్ర బడ్జెట్ – నవీన్ కుమార్ గౌడ్
విద్యను కార్పొరేటీకరణ వైపు నెట్టే కేంద్ర బడ్జెట్ – నవీన్ కుమార్ గౌడ్
స్థానికం బృందం
యాదాద్రి భువనగిరి జిల్లా యువజన నాయకులు గంగాపురం నవీన్ కుమార్ గౌడ్ కేంద్ర ప్రభుత్వ విద్యా విధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.2026–27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 2.6 శాతం మాత్రమే కేటాయించడం విద్యపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.జీడీపీలో విద్యపై 6 శాతం వ్యయం చేయాలనే జాతీయ లక్ష్యానికి ఈ బడ్జెట్ ఏమాత్రం దగ్గరగా లేదని వ్యాఖ్యానించారు.ఈ బడ్జెట్ రూపకల్పన చూస్తే, గ్రామీణ ప్రాంతాలు, పేద కుటుంబాల పిల్లలకు విద్య దూరం చేసే విధంగా విద్యను కార్పొరేటీకరణ వైపు నెట్టే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు.ప్రభుత్వ పాఠశాలల మూసివేత, ఉపాధ్యాయుల కొరత, మౌలిక సదుపాయాల లేమి వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నప్పటికీ, వాటి పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.ప్రభుత్వ యూనివర్సిటీల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని, కనీస సౌకర్యాలు కూడా అందని స్థితిలో ఉన్నాయని తెలిపారు.నిరుద్యోగ సమస్య రోజురోజుకీ పెరుగుతున్నా, దానికి తగ్గట్లుగా విద్యారంగాన్ని బలోపేతం చేసే విధానం ఈ బడ్జెట్లో కనిపించడం లేదన్నారు.నూతన జాతీయ విద్యా విధానం–2020 అమలు చేస్తామని ప్రకటిస్తున్న కేంద్ర ప్రభుత్వం, దానికి అవసరమైన ఆర్థిక వనరులు కేటాయించకపోవడం విధానాలు–నిధుల మధ్య ఉన్న విరుద్ధతను బయటపెడుతోందని పేర్కొన్నారు.మొత్తానికి ఈ బడ్జెట్ విద్యను ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పించి, ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి నెట్టే దిశగా ఉందని ఆరోపించారు.విద్యారంగానికి తక్షణమే గణనీయమైన నిధులు కేటాయించాలని, లేనిపక్షంలో ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నవీన్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి