Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 08:24 PM

ఎండల తీవ్రతకు విద్యాశాఖ కీలక నిర్ణయం

ఎండల తీవ్రతకు విద్యాశాఖ కీలక నిర్ణయం

ఎండల తీవ్రతకు విద్యాశాఖ కీలక నిర్ణయం
February 20, 2026 06:51 PM 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

మార్చి 16 నుంచి ఏపీ, తెలంగాణలో ఒంటిపూట బడులు

ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 16వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.

ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు నిర్వహించబడతాయి. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించనున్నారు.

అయితే పదో తరగతి పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆ కేంద్రాల్లో మధ్యాహ్నం 1:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు తరగతులు కొనసాగుతాయి.

ఇదే విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. అక్కడ కూడా మార్చి 16వ తేదీ నుంచే ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News