PRINT TIME: March 16, 2026 03:15 AM
ఎండల తీవ్రత.. రేపటి నుంచి తెలుగు రాష్ట్రాలలో ఒంటిపూట బడులు
ఎండల తీవ్రత.. రేపటి నుంచి తెలుగు రాష్ట్రాలలో ఒంటిపూట బడులు
March 15, 2026 02:21 PM
31 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఎండల దృష్ట్యా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 16 నుంచి ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, తెలంగాణలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు.
పాఠశాలలు ముగిసిన అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించి ఇంటికి పంపించాలని అధికారులు సూచించారు.
వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారుల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ తెలిపింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి