రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన ఎంఆర్పీఎస్ నాయకుడు గుర్కు శివ అకాల మరణం పట్ల గ్రామ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. గుర్కు శివ పార్థివదేహానికి గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ విక్రమ్ మాట్లాడుతూ, సామాజిక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటూ దళితుల హక్కుల కోసం పోరాడిన గుర్కు శివ మరణం తీరని లోటని అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, నల్ల భాస్కర్, శివగల్ల జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొని పార్థివదేహానికి నివాళులు అర్పించారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
PRINT TIME: August 28, 2026 06:34 PM
ఎంఆర్పీఎస్ నాయకుడు గుర్కు శివ మృతికి సర్పంచ్ విక్రమ్ నివాళి
ఎంఆర్పీఎస్ నాయకుడు గుర్కు శివ మృతికి సర్పంచ్ విక్రమ్ నివాళి
05-02-2026
188 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన ఎంఆర్పీఎస్ నాయకుడు గుర్కు శివ అకాల మరణం పట్ల గ్రామ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. గుర్కు శివ పార్థివదేహానికి గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ విక్రమ్ మాట్లాడుతూ, సామాజిక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటూ దళితుల హక్కుల కోసం పోరాడిన గుర్కు శివ మరణం తీరని లోటని అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, నల్ల భాస్కర్, శివగల్ల జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొని పార్థివదేహానికి నివాళులు అర్పించారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి