Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 08, 2026 10:39 AM

ఈ నెలాఖరులోగా లక్ష గృహ ప్రవేశాలు: మంత్రి పొంగులేటి

ఈ నెలాఖరులోగా లక్ష గృహ ప్రవేశాలు: మంత్రి పొంగులేటి

ఈ నెలాఖరులోగా లక్ష గృహ ప్రవేశాలు: మంత్రి పొంగులేటి
March 08, 2026 08:19 AM 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలును వేగవంతం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 31వ తేదీలోగా లక్ష గృహ యూనిట్లకు గృహ ప్రవేశాలు నిర్వహించాలన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో 3.60 లక్షల ఇళ్లను మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. వచ్చే ఏప్రిల్ నెలలో రెండో దశ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు.

లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన నగదు చెల్లింపులను ఎక్కడైనా నిలిపివేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. డబుల్ బెడ్రూం ఇళ్లకు అర్హుల ఎంపిక ప్రక్రియను కూడా ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News