Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:38 AM

ఈ నెల 16 నుంచి తెలంగాణలో అకాల వర్షాలు… రైతులకు హెచ్చరిక

ఈ నెల 16 నుంచి తెలంగాణలో అకాల వర్షాలు… రైతులకు హెచ్చరిక

ఈ నెల 16 నుంచి తెలంగాణలో అకాల వర్షాలు… రైతులకు హెచ్చరిక
10-03-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

హైదరాబాద్‌,: తెలంగాణలో మళ్లీ అకాల వర్షాలు పడే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానలు పడే ప్రమాదం కూడా ఉందని తెలిపారు.

ఈ పరిస్థితుల్లో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచించారు. కోతకు వచ్చిన పంటలను సురక్షిత ప్రదేశాలకు తరలించడం, తడి పడకుండా సంరక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

మరోవైపు ఈ నెల 15వ తేదీ వరకు రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 33 నుంచి 40 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు.

అకాల వర్షాల ప్రభావంతో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశమున్నప్పటికీ, ఉరుములు–మెరుపుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Sthanikam

ఈ నెల 16 నుంచి తెలంగాణలో అకాల వర్షాలు… రైతులకు హెచ్చరిక

Article Image

హైదరాబాద్‌,: తెలంగాణలో మళ్లీ అకాల వర్షాలు పడే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానలు పడే ప్రమాదం కూడా ఉందని తెలిపారు.

ఈ పరిస్థితుల్లో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచించారు. కోతకు వచ్చిన పంటలను సురక్షిత ప్రదేశాలకు తరలించడం, తడి పడకుండా సంరక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

మరోవైపు ఈ నెల 15వ తేదీ వరకు రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 33 నుంచి 40 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు.

అకాల వర్షాల ప్రభావంతో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశమున్నప్పటికీ, ఉరుములు–మెరుపుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News