ఈ నెల 16 నుంచి తెలంగాణలో అకాల వర్షాలు… రైతులకు హెచ్చరిక
ఈ నెల 16 నుంచి తెలంగాణలో అకాల వర్షాలు… రైతులకు హెచ్చరిక
GADDAM JAGANMOHAN REDDY
హైదరాబాద్,: తెలంగాణలో మళ్లీ అకాల వర్షాలు పడే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానలు పడే ప్రమాదం కూడా ఉందని తెలిపారు.
ఈ పరిస్థితుల్లో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచించారు. కోతకు వచ్చిన పంటలను సురక్షిత ప్రదేశాలకు తరలించడం, తడి పడకుండా సంరక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
మరోవైపు ఈ నెల 15వ తేదీ వరకు రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 33 నుంచి 40 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు.
అకాల వర్షాల ప్రభావంతో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశమున్నప్పటికీ, ఉరుములు–మెరుపుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి