e-KYC లేకున్నా బియ్యం పంపిణీకి గ్రీన్ సిగ్నల్
స్థానిక ప్రతినిధి
TG: రేషన్కార్డుదారుల్లో కలకలం రేపిన e-KYC గడువు ప్రచారానికి పౌరసరఫరాల శాఖ చెక్ పెట్టింది. ఈ నెల 31లోగా e-KYC చేయించుకోకపోతే సన్నబియ్యం నిలిపేస్తారన్న వార్తల్లో నిజం లేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. e-KYC తప్పనిసరి ప్రక్రియేనని స్పష్టం చేసిన కమిషనర్ రవీంద్ర… దీనికి తుది గడువు మాత్రం ఎప్పటికీ నిర్ణయించలేదన్నారు.
e-KYC లేనని కారణంతో బియ్యం పంపిణీ ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రేషన్కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా రేషన్ దుకాణంలో వేలిముద్రలు లేదా ఐరిష్ స్కానింగ్ ఇవ్వాలని సూచించారు. అలా చేస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి