దుబ్బాక గ్రామానికి చెందిన గుండాల శ్రీనివాస్ అదృశ్యం – కుటుంబంలో ఆందోళన
దుబ్బాక గ్రామానికి చెందిన గుండాల శ్రీనివాస్ అదృశ్యం – కుటుంబంలో ఆందోళన
స్థానికం బృందం
స్థానిక ప్రధాన ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం దుబ్బాక గ్రామానికి చెందిన గుండాల శ్రీనివాస్ గౌడ్ (38) గత డిసెంబర్ నెలలో ఇంటి నుంచి వెళ్లిన అనంతరం ఇప్పటివరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.శ్రీనివాస్ భార్య మల్లీశ్వరి, తల్లి లక్ష్మమ్మ, ఇతర బంధువులు కన్నీటితో ఎదురుచూస్తున్నప్పటికీ, ఇరుగుపొరుగు గ్రామాలు, బంధుమిత్రులను సంప్రదించినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ భార్య మల్లీశ్వరి స్థానిక రామన్నపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై డి. నాగరాజు తెలిపారు.
అదృశ్యమైన శ్రీనివాస్ శరీరాకృతి బక్కగా, ఎరుపు రంగులో నెరిసిన గడ్డంతో ఉంటాడని పోలీసులు వెల్లడించారు. ఎవరికైనా ఆయన ఆచూకీ తెలిసినట్లయితే వెంటనే రామన్నపేట పోలీస్ స్టేషన్ – 87126 62487 నంబర్కు గానీ, కుటుంబ సభ్యులకు
గుండాల నవీన్ గౌడ్ – 8712571993 / 9912050647,
గుండాల మల్లీశ్వరి – 9581515562
నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి