రామన్నపేట ద్వితీయ తరగతి న్యాయమూర్తి దంతూరి సత్తయ్య తల్లి దంతూరి అంజమ్మ దశదిన కర్మ వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామన్నపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, న్యాయవాదులు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, సంఘ నాయకులు హాజరై అంజమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి, అంజమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, సంఘ ప్రతినిధులు పాల్గొని కుటుంబానికి తమ సంఘీభావాన్ని తెలియజేశారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి