Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 05:31 AM

దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రత్యేక గౌరవం. కలెక్టర్ హనుమంతరావు

దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రత్యేక గౌరవం. కలెక్టర్ హనుమంతరావు

దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రత్యేక గౌరవం. కలెక్టర్ హనుమంతరావు
February 11, 2026 03:57 PM 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పచ్చదనం నడుమ పోలింగ్… ఆరు మున్సిపాలిటీల్లో గ్రీన్ మోడల్ కేంద్రాల సందడి

పారదర్శకంగా పోలింగ్… సీసీ కెమెరాల నిఘాలో ప్రశాంతంగా ఎన్నికలు

భువనగిరి,: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా కొనసాగుతోందని జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావు తెలిపారు. ఓటర్లకు ఆహ్లాదకర వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా ఆరు మున్సిపాలిటీల్లో గ్రీన్ మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.బుధవారం జరుగుతున్న పోలింగ్ సందర్భంగా పోచంపల్లి, చౌటుప్పల్ (లింగారెడ్డిగూడెం), భువనగిరి బీచ్ మహల్‌లోని జిల్లా పరిషత్ హైస్కూల్, యాదగిరిగుట్ట (కొత్తగుండ్లపల్లి), ఆలేరు మున్సిపాలిటీలలోని మోడల్ కేంద్రాలను పరిశీలించారు. కేంద్రాల్లో నూతన ఓటర్లకు స్వాగతం పలుకుతూ దివ్యాంగులు, వయోవృద్ధులను సన్మానించారు.గ్రీన్ మోడల్ పోలింగ్ కేంద్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పచ్చని మొక్కలు, పూల అలంకరణ, కొబ్బరి తోరణాలు, ప్లాస్టిక్ రహిత సామగ్రితో పర్యావరణహిత వాతావరణాన్ని కల్పించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తూ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. ఓటర్లు విశేష ఉత్సాహంతో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు.

పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, నీడ, ర్యాంపులు, వీల్‌చైర్లు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పోలింగ్ సిబ్బంది సమయపాలనతో విధులు నిర్వహించాలని, ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News