Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:06 PM

దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రత్యేక గౌరవం. కలెక్టర్ హనుమంతరావు

దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రత్యేక గౌరవం. కలెక్టర్ హనుమంతరావు

దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రత్యేక గౌరవం. కలెక్టర్ హనుమంతరావు
February 11, 2026 03:57 PM 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పచ్చదనం నడుమ పోలింగ్… ఆరు మున్సిపాలిటీల్లో గ్రీన్ మోడల్ కేంద్రాల సందడి

పారదర్శకంగా పోలింగ్… సీసీ కెమెరాల నిఘాలో ప్రశాంతంగా ఎన్నికలు

భువనగిరి,: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా కొనసాగుతోందని జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావు తెలిపారు. ఓటర్లకు ఆహ్లాదకర వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా ఆరు మున్సిపాలిటీల్లో గ్రీన్ మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.బుధవారం జరుగుతున్న పోలింగ్ సందర్భంగా పోచంపల్లి, చౌటుప్పల్ (లింగారెడ్డిగూడెం), భువనగిరి బీచ్ మహల్‌లోని జిల్లా పరిషత్ హైస్కూల్, యాదగిరిగుట్ట (కొత్తగుండ్లపల్లి), ఆలేరు మున్సిపాలిటీలలోని మోడల్ కేంద్రాలను పరిశీలించారు. కేంద్రాల్లో నూతన ఓటర్లకు స్వాగతం పలుకుతూ దివ్యాంగులు, వయోవృద్ధులను సన్మానించారు.గ్రీన్ మోడల్ పోలింగ్ కేంద్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పచ్చని మొక్కలు, పూల అలంకరణ, కొబ్బరి తోరణాలు, ప్లాస్టిక్ రహిత సామగ్రితో పర్యావరణహిత వాతావరణాన్ని కల్పించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తూ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. ఓటర్లు విశేష ఉత్సాహంతో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు.

పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, నీడ, ర్యాంపులు, వీల్‌చైర్లు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పోలింగ్ సిబ్బంది సమయపాలనతో విధులు నిర్వహించాలని, ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News