జిల్లాలో జనగణన శిక్షణ ప్రారంభం. అదనప కలెక్టర్
జిల్లాలో జనగణన శిక్షణ ప్రారంభం. అదనప కలెక్టర్
Editor Desk
18 నుంచి తొలి దశ తరగతులు.. 13 కేంద్రాల్లో నిర్వహణ
జిల్లా కేంద్రం: జిల్లాలో జనగణన తొలి దశకు సంబంధించిన శిక్షణ తరగతులు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నట్లు జిల్లా ప్రధాన జనగణన అధికారి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తెలిపారు.
మొదటి దశలో భాగంగా జిల్లాలోని 13 ఛార్జ్ లెవెల్ కేంద్రాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 18, 20, 21 తేదీలలో ఈ తరగతులు కొనసాగుతాయని వెల్లడించారు.
ఈ శిక్షణలో భాగంగా ప్రతి కేంద్రంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన విధి విధానాలు, బాధ్యతలు, సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. హాజరయ్యే సిబ్బంది సమయానికి హాజరై మార్గదర్శకాలను పూర్తిగా అవగాహన చేసుకుని కచ్చితంగా పాటించాలని సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి