Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సాయిరాం ఆసుపత్రిలో ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 17, 2026 08:20 PM

జిల్లాలో జనగణన శిక్షణ ప్రారంభం. అదనప కలెక్టర్

జిల్లాలో జనగణన శిక్షణ ప్రారంభం. అదనప కలెక్టర్

జిల్లాలో జనగణన శిక్షణ ప్రారంభం. అదనప కలెక్టర్
April 17, 2026 07:06 PM 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

18 నుంచి తొలి దశ తరగతులు.. 13 కేంద్రాల్లో నిర్వహణ

జిల్లా కేంద్రం: జిల్లాలో జనగణన తొలి దశకు సంబంధించిన శిక్షణ తరగతులు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నట్లు జిల్లా ప్రధాన జనగణన అధికారి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తెలిపారు.

మొదటి దశలో భాగంగా జిల్లాలోని 13 ఛార్జ్ లెవెల్ కేంద్రాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 18, 20, 21 తేదీలలో ఈ తరగతులు కొనసాగుతాయని వెల్లడించారు.

ఈ శిక్షణలో భాగంగా ప్రతి కేంద్రంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన విధి విధానాలు, బాధ్యతలు, సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.

శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. హాజరయ్యే సిబ్బంది సమయానికి హాజరై మార్గదర్శకాలను పూర్తిగా అవగాహన చేసుకుని కచ్చితంగా పాటించాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News