జిల్లా వ్యాప్తంగా తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవ కార్యక్రమాలు
జిల్లా వ్యాప్తంగా తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవ కార్యక్రమాలు
స్థానికం బృందం
ప్రభుత్వ బాలికల వసతి గృహంలో అవగాహన కార్యక్రమం
వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల కళాశాల బాలికల వసతి గృహంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం. కృష్ణారెడ్డి హాజరై విద్యార్థినీలను ఉద్దేశించి ప్రసంగించారు.సామాజిక న్యాయ దినోత్సవ ప్రాముఖ్యతను వివరించిన ఆయన, విద్యార్థినీలు చదువు ద్వారా ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. సమానత్వం, అవకాశాలపై అవగాహన పెంపొందించుకోవాలని, భవిష్యత్ అభివృద్ధికి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
విద్యార్థినీలతో సామాజిక న్యాయం సాధనపై ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ ఎన్. అంజిరెడ్డి, వెనుకబడిన తరగతుల కార్పొరేషన్ ఈ.డి.ఎస్.సి. జె. శ్యాం సుందర్, సహాయ వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి బి. సుబ్బారెడ్డి, వసతి గృహ సంక్షేమ అధికారులు కృష్ణవేణి, విజయశాంతి, సునిల్ కుమార్, రెవెన్యూ సిబ్బంది, వసతి గృహ విద్యార్థినీలు, నాలుగో తరగతి ఉద్యోగులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి