Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలపై ఎలాంటి మార్పు లేదు; ఎమ్మెల్యే సామెల్ తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:18 PM

జిల్లా వ్యాప్తంగా తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవ కార్యక్రమాలు

జిల్లా వ్యాప్తంగా తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవ కార్యక్రమాలు

జిల్లా వ్యాప్తంగా తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవ కార్యక్రమాలు
February 04, 2026 04:33 PM 85 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రభుత్వ బాలికల వసతి గృహంలో అవగాహన కార్యక్రమం

వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల కళాశాల బాలికల వసతి గృహంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం. కృష్ణారెడ్డి హాజరై విద్యార్థినీలను ఉద్దేశించి ప్రసంగించారు.సామాజిక న్యాయ దినోత్సవ ప్రాముఖ్యతను వివరించిన ఆయన, విద్యార్థినీలు చదువు ద్వారా ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. సమానత్వం, అవకాశాలపై అవగాహన పెంపొందించుకోవాలని, భవిష్యత్ అభివృద్ధికి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


విద్యార్థినీలతో సామాజిక న్యాయం సాధనపై ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ ఎన్. అంజిరెడ్డి, వెనుకబడిన తరగతుల కార్పొరేషన్ ఈ.డి.ఎస్.సి. జె. శ్యాం సుందర్, సహాయ వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి బి. సుబ్బారెడ్డి, వసతి గృహ సంక్షేమ అధికారులు కృష్ణవేణి, విజయశాంతి, సునిల్ కుమార్, రెవెన్యూ సిబ్బంది, వసతి గృహ విద్యార్థినీలు, నాలుగో తరగతి ఉద్యోగులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News