Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 12:03 AM

జిల్లా అభివృద్ధికి బ్యాంకుల సమన్వయం కీలకం: కలెక్టర్ హనుమంతరావు

జిల్లా అభివృద్ధికి బ్యాంకుల సమన్వయం కీలకం: కలెక్టర్ హనుమంతరావు

జిల్లా అభివృద్ధికి బ్యాంకుల సమన్వయం కీలకం: కలెక్టర్ హనుమంతరావు
18-02-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి, : జిల్లాలో బ్యాంకులు పరస్పర సమన్వయంతో పనిచేసి అభివృద్ధికి మరింత కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. బుధవారం మినీ మీటింగ్ హాల్‌లో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఆధ్వర్యంలో నిర్వహించిన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ (డీసీసీ)/డీఎల్‌ఆర్‌సీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.6717.56 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యంగా నిర్ణయించగా, డిసెంబర్ 2025 వరకు రూ.5966.30 కోట్ల రుణాలు మంజూరు చేయడం ద్వారా 88.82 శాతం సాధన నమోదైందని ఎల్‌డిఎం కె. శివ రామకృష్ణ తెలిపారు. ప్రాధాన్యతా రంగంలో రూ.5392.22 కోట్ల లక్ష్యానికి గాను రూ.4219.15 కోట్లు (78.25%) రుణాలు మంజూరయ్యాయి.

మహిళా సంఘాలకు గ్రామీణాభివృద్ధి శాఖ, బ్యాంకుల ద్వారా రూ.611.18 కోట్ల ప్రణాళికకు గాను రూ.502.97 కోట్లు (82.3%) విడుదలయ్యాయి. ఎంఈపీఎంఏ ద్వారా రూ.104.08 కోట్ల రుణాలు మంజూరయ్యాయి.కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎంఈజీపీ,పీఎం విశ్వకర్మ ,పీఎం స్వనిది , జన సురక్ష పథకాల వంటి పథకాల లక్ష్యాలను బ్యాంకులు సమయానికి పూర్తి చేయాలని సూచించారు.

అనంతరం 2026–27 సంవత్సరానికి నాబార్డ్ రూపొందించిన పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ (పీఎల్‌పీ) కరదీపికను కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లాకు సంబంధించి పీఎల్‌పీ ప్రకారం ఎంఎస్‌ఎంఈలకు రూ.1182.52 కోట్లు, విద్యారుణాలకు రూ.22.57 కోట్లు, గృహరుణాలకు రూ.90.34 కోట్లు, ఇతర ప్రాధాన్యతా రంగాలకు రూ.28.58 కోట్లు కలిపి మొత్తం రూ.6337.71 కోట్ల ఆర్థిక అవకాశాన్ని నాబార్డ్ అంచనా వేసింది.

సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం రవీందర్, ఆర్బీఐ ఏజీఎం లక్ష్మీ శ్రావ్య, నాబార్డ్ డీడీఎం రవీందర్, ఎంఈపీఎంఏ డీఎంసీ రమేష్, ఎల్‌డిఎం కె. శివ రామకృష్ణ, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

జిల్లా అభివృద్ధికి బ్యాంకుల సమన్వయం కీలకం: కలెక్టర్ హనుమంతరావు

Article Image

యాదాద్రి భువనగిరి, : జిల్లాలో బ్యాంకులు పరస్పర సమన్వయంతో పనిచేసి అభివృద్ధికి మరింత కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. బుధవారం మినీ మీటింగ్ హాల్‌లో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఆధ్వర్యంలో నిర్వహించిన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ (డీసీసీ)/డీఎల్‌ఆర్‌సీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.6717.56 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యంగా నిర్ణయించగా, డిసెంబర్ 2025 వరకు రూ.5966.30 కోట్ల రుణాలు మంజూరు చేయడం ద్వారా 88.82 శాతం సాధన నమోదైందని ఎల్‌డిఎం కె. శివ రామకృష్ణ తెలిపారు. ప్రాధాన్యతా రంగంలో రూ.5392.22 కోట్ల లక్ష్యానికి గాను రూ.4219.15 కోట్లు (78.25%) రుణాలు మంజూరయ్యాయి.

మహిళా సంఘాలకు గ్రామీణాభివృద్ధి శాఖ, బ్యాంకుల ద్వారా రూ.611.18 కోట్ల ప్రణాళికకు గాను రూ.502.97 కోట్లు (82.3%) విడుదలయ్యాయి. ఎంఈపీఎంఏ ద్వారా రూ.104.08 కోట్ల రుణాలు మంజూరయ్యాయి.కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎంఈజీపీ,పీఎం విశ్వకర్మ ,పీఎం స్వనిది , జన సురక్ష పథకాల వంటి పథకాల లక్ష్యాలను బ్యాంకులు సమయానికి పూర్తి చేయాలని సూచించారు.

అనంతరం 2026–27 సంవత్సరానికి నాబార్డ్ రూపొందించిన పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ (పీఎల్‌పీ) కరదీపికను కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లాకు సంబంధించి పీఎల్‌పీ ప్రకారం ఎంఎస్‌ఎంఈలకు రూ.1182.52 కోట్లు, విద్యారుణాలకు రూ.22.57 కోట్లు, గృహరుణాలకు రూ.90.34 కోట్లు, ఇతర ప్రాధాన్యతా రంగాలకు రూ.28.58 కోట్లు కలిపి మొత్తం రూ.6337.71 కోట్ల ఆర్థిక అవకాశాన్ని నాబార్డ్ అంచనా వేసింది.

సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం రవీందర్, ఆర్బీఐ ఏజీఎం లక్ష్మీ శ్రావ్య, నాబార్డ్ డీడీఎం రవీందర్, ఎంఈపీఎంఏ డీఎంసీ రమేష్, ఎల్‌డిఎం కె. శివ రామకృష్ణ, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News