Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:39 AM

జిల్లా అభివృద్ధికి బ్యాంకుల సమన్వయం కీలకం: కలెక్టర్ హనుమంతరావు

జిల్లా అభివృద్ధికి బ్యాంకుల సమన్వయం కీలకం: కలెక్టర్ హనుమంతరావు

జిల్లా అభివృద్ధికి బ్యాంకుల సమన్వయం కీలకం: కలెక్టర్ హనుమంతరావు
February 18, 2026 06:58 PM 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి, : జిల్లాలో బ్యాంకులు పరస్పర సమన్వయంతో పనిచేసి అభివృద్ధికి మరింత కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. బుధవారం మినీ మీటింగ్ హాల్‌లో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఆధ్వర్యంలో నిర్వహించిన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ (డీసీసీ)/డీఎల్‌ఆర్‌సీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.6717.56 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యంగా నిర్ణయించగా, డిసెంబర్ 2025 వరకు రూ.5966.30 కోట్ల రుణాలు మంజూరు చేయడం ద్వారా 88.82 శాతం సాధన నమోదైందని ఎల్‌డిఎం కె. శివ రామకృష్ణ తెలిపారు. ప్రాధాన్యతా రంగంలో రూ.5392.22 కోట్ల లక్ష్యానికి గాను రూ.4219.15 కోట్లు (78.25%) రుణాలు మంజూరయ్యాయి.

మహిళా సంఘాలకు గ్రామీణాభివృద్ధి శాఖ, బ్యాంకుల ద్వారా రూ.611.18 కోట్ల ప్రణాళికకు గాను రూ.502.97 కోట్లు (82.3%) విడుదలయ్యాయి. ఎంఈపీఎంఏ ద్వారా రూ.104.08 కోట్ల రుణాలు మంజూరయ్యాయి.కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎంఈజీపీ,పీఎం విశ్వకర్మ ,పీఎం స్వనిది , జన సురక్ష పథకాల వంటి పథకాల లక్ష్యాలను బ్యాంకులు సమయానికి పూర్తి చేయాలని సూచించారు.

అనంతరం 2026–27 సంవత్సరానికి నాబార్డ్ రూపొందించిన పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ (పీఎల్‌పీ) కరదీపికను కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లాకు సంబంధించి పీఎల్‌పీ ప్రకారం ఎంఎస్‌ఎంఈలకు రూ.1182.52 కోట్లు, విద్యారుణాలకు రూ.22.57 కోట్లు, గృహరుణాలకు రూ.90.34 కోట్లు, ఇతర ప్రాధాన్యతా రంగాలకు రూ.28.58 కోట్లు కలిపి మొత్తం రూ.6337.71 కోట్ల ఆర్థిక అవకాశాన్ని నాబార్డ్ అంచనా వేసింది.

సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం రవీందర్, ఆర్బీఐ ఏజీఎం లక్ష్మీ శ్రావ్య, నాబార్డ్ డీడీఎం రవీందర్, ఎంఈపీఎంఏ డీఎంసీ రమేష్, ఎల్‌డిఎం కె. శివ రామకృష్ణ, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News