డిసెంబర్లోగా భూ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం: సీఎం చంద్రబాబు
డిసెంబర్లోగా భూ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం: సీఎం చంద్రబాబు
GADDAM JAGANMOHAN REDDY
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న భూ సమస్యలను ఈ ఏడాది డిసెంబర్లోగా పూర్తిగా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రైతులు భూములకు సంబంధించిన సమస్యలతో ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అయితే వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో రైతులు భూ సమస్యల పరిష్కారం కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యలు పరిష్కారం కావాలని నిత్యం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పనులు ముందుకు సాగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యేకంగా రీ సర్వే నిర్వహించిన గ్రామాల్లో జాయింట్ ఎల్పీఎం సమస్యలు, 22-ఏ భూములు, ఇనాం భూములు, ఫ్రీహోల్డ్ భూములు వంటి అనేక అంశాలు పెండింగ్లో ఉండడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వీటన్నింటినీ త్వరగా పరిష్కరిస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి