డిపిఓ విష్ణువర్ధన్ రెడ్డి కి ఘన వీడ్కోలు
డిపిఓ విష్ణువర్ధన్ రెడ్డి కి ఘన వీడ్కోలు
Editor Desk
జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓగా విధులు నిర్వహించిన విష్ణువర్ధన్ రెడ్డి గారికి పదోన్నతి లభించి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి (DRDO)గా సూర్యాపేట జిల్లాకు బదిలీ అయిన సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ, విష్ణువర్ధన్ రెడ్డి తన పదవీకాలంలో జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా పరిషత్ సీఈఓగా వివిధ రంగాలలో విశేష సేవలు అందించారని కొనియాడారు. గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రజలకు చేరువైన పరిపాలనలో ఆయన చూపిన నిబద్ధత ప్రశంసనీయమని అన్నారు. పంచాయతీ ఎన్నికలను సమన్వయంతో, ఎలాంటి లోపాలు లేకుండా విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ ప్రతి ఫైలును సులభతరంగా పరిష్కరించే విధంగా కృషి చేశారని ప్రశంసించారు. పారదర్శకంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం ఆయన పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆయన మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్ఓ జయమ్మ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి, జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి