Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
క్రికెట్ బెట్టింగ్‌పై కఠిన హెచ్చరికలు – పోలీసులు కౌన్సిలింగ్ కొత్త గ్యాస్ కనెక్షన్లు నిలిపివేత.. సరఫరా సంక్షోభం ప్రభావం సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 13, 2026 10:37 PM

డిపిఓ విష్ణువర్ధన్ రెడ్డి కి ఘన వీడ్కోలు

డిపిఓ విష్ణువర్ధన్ రెడ్డి కి ఘన వీడ్కోలు

డిపిఓ విష్ణువర్ధన్ రెడ్డి కి ఘన వీడ్కోలు
April 13, 2026 08:52 PM 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓగా విధులు నిర్వహించిన విష్ణువర్ధన్ రెడ్డి గారికి పదోన్నతి లభించి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి (DRDO)గా సూర్యాపేట జిల్లాకు బదిలీ అయిన సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ, విష్ణువర్ధన్ రెడ్డి తన పదవీకాలంలో జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా పరిషత్ సీఈఓగా వివిధ రంగాలలో విశేష సేవలు అందించారని కొనియాడారు. గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రజలకు చేరువైన పరిపాలనలో ఆయన చూపిన నిబద్ధత ప్రశంసనీయమని అన్నారు. పంచాయతీ ఎన్నికలను సమన్వయంతో, ఎలాంటి లోపాలు లేకుండా విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు.

రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ ప్రతి ఫైలును సులభతరంగా పరిష్కరించే విధంగా కృషి చేశారని ప్రశంసించారు. పారదర్శకంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం ఆయన పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆయన మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్ఓ జయమ్మ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి, జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News