Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక అక్రమ మైనింగ్ ఆరోపణలపై అధికారుల మౌనం ఎందుకు?... హైకోర్టును ఆశ్రయించిన ఆర్టీఐ కార్యకర్త ఉబ్బని రాజు ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 11:20 AM

డిపిఓ విష్ణువర్ధన్ రెడ్డి కి ఘన వీడ్కోలు

డిపిఓ విష్ణువర్ధన్ రెడ్డి కి ఘన వీడ్కోలు

డిపిఓ విష్ణువర్ధన్ రెడ్డి కి ఘన వీడ్కోలు
April 13, 2026 08:52 PM 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓగా విధులు నిర్వహించిన విష్ణువర్ధన్ రెడ్డి గారికి పదోన్నతి లభించి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి (DRDO)గా సూర్యాపేట జిల్లాకు బదిలీ అయిన సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ, విష్ణువర్ధన్ రెడ్డి తన పదవీకాలంలో జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా పరిషత్ సీఈఓగా వివిధ రంగాలలో విశేష సేవలు అందించారని కొనియాడారు. గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రజలకు చేరువైన పరిపాలనలో ఆయన చూపిన నిబద్ధత ప్రశంసనీయమని అన్నారు. పంచాయతీ ఎన్నికలను సమన్వయంతో, ఎలాంటి లోపాలు లేకుండా విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు.

రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ ప్రతి ఫైలును సులభతరంగా పరిష్కరించే విధంగా కృషి చేశారని ప్రశంసించారు. పారదర్శకంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం ఆయన పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆయన మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్ఓ జయమ్మ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి, జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News