Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 27, 2026 11:04 AM

“డిజిటల్ ఇండియా పేరుతో రోడ్డుపై ఫిజికల్ రికవరీ: ప్రజల ఓపికకు పరీక్ష!”

“డిజిటల్ ఇండియా పేరుతో రోడ్డుపై ఫిజికల్ రికవరీ: ప్రజల ఓపికకు పరీక్ష!”

“డిజిటల్ ఇండియా పేరుతో రోడ్డుపై ఫిజికల్ రికవరీ: ప్రజల ఓపికకు పరీక్ష!”
February 27, 2026 09:24 AM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

నేటి పరిస్థితుల్లో దేశం పూర్తిగా డిజిటల్ మార్గంలో నడుస్తోంది. ప్రతి రకమైన సౌకర్యం, పని, చెల్లింపులు కూడా ఆన్‌లైన్‌గా జరుగుతున్నాయి. ట్యాక్సులు, బిల్లులు, ఇన్వాయిస్లు, బ్యాంక్ ట్రాన్సాక్షన్లు, డబ్బింతలు అన్నీ క్లిక్ చేస్తే చాలు – సెకన్‌లు లోపల ముగిసిపోతాయి. ఇంకా ఎక్కువగా UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా ప్రజలు క్యాష్‌లెస్ జీవితానికి అలవాటుపడుతున్నారు. అయితే, ఈ డిజిటల్ ఫ్లో మధ్యలో కూడా కొన్ని విభాగాలు మాత్రం ఇంకా పాత క్యాష్‑ఆధారిత విధానంతోనే కొనసాగుతున్నాయి. అందులో ప్రధానమైనది RTO ఫిజికల్ రికవరీ సిస్టమ్. రోడ్లపై డ్రైవర్లు నో రీజన్‌తో కారు ఆపి, క్యాష్ లేదా చెల్లింపు కోసం డిమాండ్ చేసే RTO కొందరు అధికారులు, ప్రయాణికులను అవసరం లేకుండా ఆపుతూ సమయం, నిద్ర, ఆరోగ్యం కూడా దెబ్బ తీస్తున్నారు. ఇది డిజిటల్ ఇండియా కార్యక్రమం ఆరంభమైన తర్వాత కూడా కొనసాగుతున్న విచిత్రమైన పరిస్థితి. సిస్టమ్ పూర్తిగా ఆన్‌లైన్‌గా ఉన్నప్పటికీ, రోడ్డుపై ఫిజికల్ రికవరీ ఎందుకు అవసరం? ఇది ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే పద్ధతి.

డిజిటల్ ఇండియా పేరుతో ప్రతి ప్రభుత్వ సేవ ట్రాన్స్‌పెరెంట్‌గా, ఇఫెక్టివ్‌గా ఉండాలి కానీ ఇప్పుడు రోడ్డుపై ఫిజికల్ రికవరీ వల్ల పారదర్శకత కనిపించడం లేదు. ప్రతి చెల్లింపు కూడా డిజిటల్ గా ఉండి, ఆన్‌లైన్ రికార్డుల్లో నేరుగా నమోదు అయ్యేలా ఉండాలి. ఆ విధంగా చెల్లింపులు క్లియర్‌గా ట్రాక్ చేయొచ్చు, అకౌంటబిలిటీ పెరుగుతుంది. క్యాష్ వసూలు చేసే పద్ధతులు ఫ్రాండు, కరెప్ట్ ప్రాక్టీసులకు దారి తీస్తాయి. ప్రతి రకమైన రికవరీ – ట్యాక్సులు, ఫైన్లు, చెల్లింపులు – కూడా 100% ఆన్‌లైన్ గా, డిజిటల్ గా ఉండాలి. ఫిజికల్ రికవరీ పూర్తిగా నిషేధం చేసి డిజిటల్ పేమెంట్లు మాత్రమే “స్టాండర్డ్ పద్ధతి”గా తీసుకోవాలి. అప్పుడే డిజిటల్ ఇండియా అనే స్లోగన్ నిజాయితీగా నెరవేరుతుంది. ప్రతి ప్రజా సేవ కూడా క్లీన్, అకౌంటబుల్, ట్రాన్స్‌పెరెంట్ గా ఉండాలి. ఫిజికల్ రికవరీ వల్ల ప్రజల సమయం వృథా, అవసరం లేకుండా ఆపటం, అలాంటి పనులు చేసే అధికారులపై హెచ్చరికలు కూడా రావాలి. డిజిటల్ ఇండియా అంటే సిస్టమ్ ఆన్‌లైన్, రికార్డులు డిజిటల్, సేవలు క్లీన్ మరియు అకౌంటబుల్ గా ఉండాలి.

మా డిమాండ్ స్పష్టం – డిజిటల్ ఇండియాలో ఫిజికల్ రికవరీ కోసం రోడ్డుపై ఆపే ప్రయాణికులను ఇక ముందు అవసరం లేకుండా ఆపకూడదు. ప్రతి రకమైన రికవరీ కూడా ఆన్‌లైన్ గా, డిజిటల్ గా నిర్వహించాలి. ఇది ప్రజల హక్కు, పారదర్శకత కోసం చేసే డిమాండ్.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News