డీప్ ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం
డీప్ ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం
GADDAM JAGANMOHAN REDDY
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ డీప్ ఫేక్ వీడియోలను సృష్టించి తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కొందరు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
కృత్రిమ మేధస్సు సాంకేతికతను దుర్వినియోగం చేసి తన రూపాన్ని, స్వరాన్ని అనుకరించే విధంగా వీడియోలు తయారు చేసి ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈ కంటెంట్ మొత్తం అసత్యమైనదని, వక్రీకరించినదని స్పష్టం చేశారు. ఇది కేవలం తన వ్యక్తిగత ప్రతిష్ఠను కాకుండా టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చేందుకు పన్నిన పథకమని పేర్కొన్నారు.
ఈ వ్యవహారం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని, వైసీపీకి చెందిన కొందరు ఈ తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. నాపై జరుగుతున్న ఈ దుష్ప్రచారంపై చట్టపరంగా ముందుకెళ్తానని హెచ్చరించారు.
సోషల్ మీడియాలో తనపై సాగుతున్న అసత్య ప్రచారం వెనుక ఉన్న కుట్రను వెలికితీయాలని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్న వ్యక్తులను, దుష్ట శక్తులను వదిలేది లేదని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి