Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 08:57 PM

డ్రైనేజీ లేక రోడ్డే మురుగు కాలువగా మారింది… అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల మండిపాటు

డ్రైనేజీ లేక రోడ్డే మురుగు కాలువగా మారింది… అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల మండిపాటు

డ్రైనేజీ లేక రోడ్డే మురుగు కాలువగా మారింది… అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల మండిపాటు
February 17, 2026 10:39 AM 76 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

రోడ్డుపైనే మురుగు ప్రవాహం… ఐదో వార్డు ప్రజల ఆవేదన

రామన్నపేట మండలం కేంద్రంలోని ఐదో వార్డులో పారిశుధ్య సమస్య తీవ్రరూపం దాల్చింది. బిసి బాలుర వసతి గృహం సమీపంలో డ్రైనేజీ సదుపాయం లేక ఇండ్ల మురుగు నీరు నేరుగా రోడ్డుపైకి చేరుతోంది.

రైతులు, విద్యార్థులు, పాదచారులు నిత్యం ప్రయాణించే ఈ మార్గం మురుగు నీటితో నిండిపోవడంతో తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. దోమలు, పందులు చేరి అంటువ్యాధుల ముప్పు పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అభివృద్ధి పనులు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని ఆరోపిస్తూ, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి శాశ్వత డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News