న్యూస్ ఇయర్ సందర్భంగా కఠిన చర్యలు
స్థానికం ప్రతినిధి బిక్షం
న్యూస్ ఇయర్ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్పై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వారు పలుకుబడిని ఉపయోగించేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు.
“మా డాడీ ఎవరో తెలుసా?, మా అంకుల్ ఎవరో తెలుసా? అంటూ అధికారులను ప్రశ్నించవద్దు. మీ ప్రైవసీకి పూర్తి గౌరవం ఇస్తాం. వాహనం పక్కన పెట్టి, కోర్టు తేదీన కలుద్దాం” అని ఆయన అన్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఎలాంటి ఉపేక్ష ఉండదని స్పష్టం చేసిన సీపీ, న్యూస్ ఇయర్ వేడుకల నేపథ్యంలో ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని తెలిపారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి