దళితవాడకు తాగునీటి దాహం… అధికారుల నిర్లక్ష్యంపై రోడ్డెక్కిన మహిళలు
దళితవాడకు తాగునీటి దాహం… అధికారుల నిర్లక్ష్యంపై రోడ్డెక్కిన మహిళలు
స్థానికం బృందం
విజయనగరం స్థానికం ప్రధాన ప్రతినిధి
విజయనగరం జిల్లా, రేగిడి మండలం, సరసానపల్లి:దళితవాడలను చిన్నచూపు చూస్తున్నారని, కనీస అవసరమైన తాగునీటికోసం ఎన్నిసార్లు విన్నవించినా కూటమి ప్రభుత్వంలో పట్టించుకునే నాథుడే లేడని దళిత మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.విజయనగరం జిల్లా రేగిడి మండలం సరసానపల్లి సచివాలయం ఎదుట వృద్ధులు, మహిళలు పెద్ద సంఖ్యలో చేరి తాగునీటి సమస్యపై నిరసన తెలిపారు.దళితవాడలో సుమారు 45 కుటుంబాలు రెండు వారాలుగా మంచినీటి సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాలేదని, పాలకులు తమ గోడు వినిపించుకోవడంలేదని నిరసనకారులు ఆరోపించారు.రోజువారీ అవసరాలకే కాకుండా వృద్ధులు, చిన్నారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.సచివాలయాల వ్యవస్థ ఉన్నప్పటికీ సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని మహిళలు మండిపడ్డారు. తక్షణమే ఎమ్మెల్యే స్పందించి దళితవాడకు శాశ్వత తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
మౌలిక వసతుల విషయంలోనూ వివక్ష కొనసాగుతుందా? అన్న ప్రశ్నలు ఈ నిరసనతో ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతారా? అన్నది వేచి చూడాల్సిందే.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి