Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బోగారం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 02:50 PM

చౌటుప్పల్ 10వ వార్డులో రాజకీయ వేడి బిఆర్ఎస్ అభ్యర్థిగా ఉడుగు కల్పన మల్లేశం గౌడ్ నామినేషన్

చౌటుప్పల్ 10వ వార్డులో రాజకీయ వేడి బిఆర్ఎస్ అభ్యర్థిగా ఉడుగు కల్పన మల్లేశం గౌడ్ నామినేషన్

చౌటుప్పల్ 10వ వార్డులో రాజకీయ వేడి బిఆర్ఎస్ అభ్యర్థిగా ఉడుగు కల్పన మల్లేశం గౌడ్ నామినేషన్
January 30, 2026 06:01 PM 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు నుంచి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉడుగు కల్పన మల్లేశం గౌడ్ మున్సిపల్ ఎన్నికల బరిలో నిలవడంతో వార్డులో ఎన్నికల సందడి నెలకొంది. ఆమె అధికారికంగా నామినేషన్ దాఖలు చేయడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.ఈ సందర్భంగా ఉడుగు కల్పన మల్లేశం గౌడ్ మాట్లాడుతూ, వార్డులోని మౌలిక సదుపాయాల లోపాలు, తాగునీటి సమస్య, రహదారుల అభివృద్ధి, పారిశుధ్య అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే ప్రతినిధిగా పనిచేస్తానని హామీ ఇస్తూ, పారదర్శక పాలనతో పాటు ప్రజా సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. 10వ వార్డు సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపాలని వార్డు ప్రజలను కోరిన ఆమె, కౌన్సిలర్‌గా అవకాశం ఇస్తే మరిన్ని సేవలు ప్రజలకు అందిస్తానని భరోసా ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సహకారంతో, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అండదండలతో, కేటీఆర్ సారథ్యంలో వార్డులో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News