Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలపై ఎలాంటి మార్పు లేదు; ఎమ్మెల్యే సామెల్ తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 11:22 AM

చౌటుప్పల్ 10వ వార్డులో రాజకీయ వేడి బిఆర్ఎస్ అభ్యర్థిగా ఉడుగు కల్పన మల్లేశం గౌడ్ నామినేషన్

చౌటుప్పల్ 10వ వార్డులో రాజకీయ వేడి బిఆర్ఎస్ అభ్యర్థిగా ఉడుగు కల్పన మల్లేశం గౌడ్ నామినేషన్

చౌటుప్పల్ 10వ వార్డులో రాజకీయ వేడి బిఆర్ఎస్ అభ్యర్థిగా ఉడుగు కల్పన మల్లేశం గౌడ్ నామినేషన్
January 30, 2026 06:01 PM 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు నుంచి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉడుగు కల్పన మల్లేశం గౌడ్ మున్సిపల్ ఎన్నికల బరిలో నిలవడంతో వార్డులో ఎన్నికల సందడి నెలకొంది. ఆమె అధికారికంగా నామినేషన్ దాఖలు చేయడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.ఈ సందర్భంగా ఉడుగు కల్పన మల్లేశం గౌడ్ మాట్లాడుతూ, వార్డులోని మౌలిక సదుపాయాల లోపాలు, తాగునీటి సమస్య, రహదారుల అభివృద్ధి, పారిశుధ్య అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే ప్రతినిధిగా పనిచేస్తానని హామీ ఇస్తూ, పారదర్శక పాలనతో పాటు ప్రజా సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. 10వ వార్డు సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపాలని వార్డు ప్రజలను కోరిన ఆమె, కౌన్సిలర్‌గా అవకాశం ఇస్తే మరిన్ని సేవలు ప్రజలకు అందిస్తానని భరోసా ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సహకారంతో, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అండదండలతో, కేటీఆర్ సారథ్యంలో వార్డులో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News