Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 01:55 AM

చిట్యాల ప్రజల చూపు కారు వైపు – శేపూరి జయమ్మ రవీందర్ గెలుపుపై ధీమా.బొక్క మాధవరెడ్డి

చిట్యాల ప్రజల చూపు కారు వైపు – శేపూరి జయమ్మ రవీందర్ గెలుపుపై ధీమా.బొక్క మాధవరెడ్డి

చిట్యాల ప్రజల చూపు కారు వైపు – శేపూరి జయమ్మ రవీందర్ గెలుపుపై ధీమా.బొక్క మాధవరెడ్డి
February 04, 2026 02:52 PM 128 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. మూడో వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి శేపూరి జయమ్మ రవీందర్ గెలుపు ఖాయమని పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుంటూ ఈసారి తప్పకుండా కారు గుర్తుకు ఓటు వేస్తామని చిట్యాల ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారని నాయకులు తెలిపారు.

మూడో వార్డు ఇంచార్జ్ బొక్క మాధవరెడ్డి మాట్లాడుతూ, నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య చిట్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు కేటాయించారని గుర్తు చేశారు. అభివృద్ధి కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మూడో వార్డు అభ్యర్థి శేపూరి జయమ్మ రవీందర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.ఈ ప్రచార కార్యక్రమంలో సిరిపురం మాజీ ఉపసర్పంచ్ కోనూరు ముత్తయ్య గౌడ్, మాజీ ఎంపీటీసీ పున్నా వెంకటేశం తదితరులు పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News