చిట్యాల మున్సిపాలిటీ నాలుగో వార్డులో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం – రామన్నపేట నాయకుల ధీమా
చిట్యాల మున్సిపాలిటీ నాలుగో వార్డులో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం – రామన్నపేట నాయకుల ధీమా
స్థానికం బృందం
నల్గొండ జిల్లా, చిట్యాల:
చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతోందని, ముఖ్యంగా నాలుగో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోనేటి ఎల్లయ్య అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయమని రామన్నపేట మండల కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రజాప్రయోజన సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీకి బలమైన ఆయుధంగా మారాయని, ఆ పథకాలపై ప్రజల్లో ఉన్న విశ్వాసమే అభ్యర్థులను భారీ మెజార్టీలతో గెలిపించబోతుందని తెలిపారు.ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహన, అభివృద్ధే లక్ష్యంగా పని చేసే నాయకత్వమే కాంగ్రెస్ పార్టీ బలమని, అదే చిట్యాల మున్సిపాలిటీలో స్పష్టంగా కనిపిస్తోందని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలోజిల్లా కాంగ్రెస్ నాయకులు గుత్తా నర్సింహారెడ్డి, నంద్యాల భిక్షం రెడ్డి, మేడి రవిచంద్ర, శంబాల వెంకటేశం, చిల్లర కైలాసం తదితరులు పాల్గొని అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి