చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డు స్వతంత్ర అభ్యర్థి నాగిళ్ల సుధాకర్ ఇంటింటా ప్రచారం
చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డు స్వతంత్ర అభ్యర్థి నాగిళ్ల సుధాకర్ ఇంటింటా ప్రచారం
స్థానికం బృందం
ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి
చిట్యాల మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల్లో ఒకటో వార్డు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగిళ్ల సుధాకర్ శివనేనిగూడెం గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సీరియల్ నెంబర్–6లో ఉన్న ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ సందర్భంగా నాగిళ్ల సుధాకర్ మాట్లాడుతూ…శివనేనిగూడెం గ్రామంలో 99 శాతం మంది రైతులే ఉన్నారని, కానీ గ్రామాన్ని స్వార్థ రాజకీయాల కోసం మున్సిపాలిటీలో కలపడంతో రైతులు, రైతు కూలీలకు ఉపయోగపడే ఉపాధి హామీ పనులు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ వచ్చాక గ్రామానికి జరిగిన అభివృద్ధి ఏంటని ప్రశ్నిస్తూ…
ప్రతి సంవత్సరం అధిక పన్నులు వసూలు చేయడం, గ్రామంలో చెత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడటం తప్ప గ్రామానికి ఒరిగిందేమీ లేదన్నారు.ఇప్పటివరకు వివిధ పార్టీల తరఫున గెలిచిన ప్రజాప్రతినిధులు తమ స్వంత అభివృద్ధికే పరిమితమయ్యారని, గ్రామ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని విమర్శించారు.
గెలిచిన తర్వాత చేపట్టే కార్యక్రమాలు:
అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించడం
గ్రామంలో పూర్తి కాని సీసీ రోడ్లను త్వరితగతిన పూర్తి చేయించడం
డంపింగ్ యార్డ్ తొలగింపుకు ప్రత్యేక కృషి
మహాలింగేశ్వర స్వామి జాతరకు రూ.25,000 విరాళం
గ్రామంలో కోతుల బెడద లేకుండా చర్యలు
ప్రతి ఆడపిల్ల వివాహానికి రూ.10,016 నగదు సహాయం
శివాలయం, ఆంజనేయస్వామి ఆలయాలకు కమిటీలు ఏర్పాటు చేసి నిత్య దీపారాధన
స్కూల్ నుంచి మహాలింగేశ్వర ఆలయం వరకు స్ట్రీట్ లైట్లు ఏర్పాటు
గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు
మెరుగైన విద్య, వైద్య, విద్యుత్, పరిశుభ్రత సదుపాయాలు
తాను కౌన్సిలర్గా గెలిచిన తర్వాత సొంత నిధులతోనూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి