చిట్యాల 6వ వార్డులో బీజేపీ శంఖారావం – గంజి గోవర్ధన్ నామినేషన్తో ప్రచారానికి తెర
చిట్యాల 6వ వార్డులో బీజేపీ శంఖారావం – గంజి గోవర్ధన్ నామినేషన్తో ప్రచారానికి తెర
స్థానికం బృందం
స్థానికం ప్రధాన ప్రతినిధి
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల వేడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ తరఫున చిట్యాల 6వ వార్డు అభ్యర్థిగా గంజి గోవర్ధన్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమం పార్టీ శ్రేణులు, కార్యకర్తల నినాదాలతో ఉత్సాహభరితంగా సాగింది.ఈ కార్యక్రమంలో బీజేపీ చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ఇంచార్జి బందరాపు లింగస్వామి, చిట్యాల పట్టణ అధ్యక్షులు గుండాల నరేష్ గౌడ్, బీజేపీ రాష్ట్ర నాయకులు రుద్రవరం లింగస్వామి, జిల్లా కౌన్సిల్ సభ్యులు కూరెళ్ల శ్రీను, జిల్లా నాయకులు జయరాపు రామకృష్ణ, తీగాల శివ తదితరులు పాల్గొని అభ్యర్థికి పూర్తి మద్దతు ప్రకటించారు.నాయకులు మాట్లాడుతూ చిట్యాల మున్సిపాలిటీలో బీజేపీ విజయానికి ఇది ఆరంభమని, ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన అజెండా అని స్పష్టం చేశారు. గంజి గోవర్ధన్ ప్రజల ఆశీర్వాదంతో ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి