ప్రచారంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నల్లగొండ జిల్లా:స్థానికం ప్రధాన ప్రతినిధి
నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీ 12వ వార్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మంగళవారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన ఇంటింటి ప్రచారం చేపట్టి, ప్రజలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని పేర్కొంటూ, ప్రజలకు అందుబాటులో ఉండే పాలన అవసరమని అభిప్రాయపడ్డారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని కోరారు.ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి