చిన్న శ్రీశైలం గుట్టపై బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్త లగ్న నిర్ణయం
చిన్న శ్రీశైలం గుట్టపై బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్త లగ్న నిర్ణయం
స్థానికం బృందం
రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో మల్లన్న గుట్టపై కొలువై ఉన్న శ్రీ స్వయంభు భ్రమరాంబ మల్లికార్జున స్వామి
(చిన్న శ్రీశైలం ) ఆలయంలో రానున్న బ్రహ్మోత్సవాల లగ్న నిర్ణయ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో మహాక్రతుగా జరిగింది. వేదమంత్రాల నడుమ ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడింది.ఆలయ అర్చకులు, వేదపండితులు బేతోజు సత్యనారాయణ శాస్త్రి, శశిధర దీక్షితులు శాస్త్రోక్తంగా లగ్నాన్ని నిర్ణయించారు. బ్రహ్మోత్సవాలు శుభప్రదంగా నిర్వహించేందుకు స్వామి ఆశీస్సులు లభించాయని పండితులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ సల్ల నరసింహ, డైరెక్టర్లు ఆగు లింగస్వామి, సంకు స్వామి, కడారి మల్లేశం, భాషమల్ల బాలరాజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గ్రామ సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య, ఉపసర్పంచ్ కొండ అండాలు మల్లయ్యతో పాటు వార్డు సభ్యులు సల్ల శిల్పా మల్లేష్, కొండ శ్రీను, వరకాల వినయ్, వంగల పూజిత శివకుమార్, ఏకుల మల్లేష్, భాషమల్ల సంతోష్, కడారి ఐలయ్య గ్రామ పెద్దలు బొడిగె రంగయ్య, సల్ల శ్రీశైలం, వల్లమల మల్లయ్య, తోటకూరి ఐలయ్య, దయ్యాల బిక్షం, కడారి బిక్షం, కడారి యాదయ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి