చీమలకొండూరులో పౌర హక్కుల దినోత్సవం
చీమలకొండూరులో పౌర హక్కుల దినోత్సవం
స్థానికం బృందం
పౌర హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి
రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులపై ప్రతి పౌరుడూ అవగాహన కలిగి ఉండాలని భువనగిరి మండల ఉప తహసీల్దార్ కళ్యాణ్ తెలిపారు. శనివారం భువనగిరి మండలంలోని చీమలకొండూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ పల్లెర్ల అంజయ్య అధ్యక్షతన నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సీ–ఎస్టీ విజిలెన్స్ మరియు పర్యవేక్షణ కమిటీ సభ్యుడు బర్రె సుదర్శన్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు కల్పించిన హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. హక్కులకు భంగం కలిగితే అధికారుల ద్వారా, న్యాయస్థానాల ద్వారా రక్షించుకోవాలని సూచించారు.
గ్రామ సర్పంచ్ పల్లెర్ల అంజయ్య మాట్లాడుతూ గ్రామానికి అదనంగా ఇరవై ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని, స్మశాన వాటికలలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. అలాగే ఎస్సీ కాలనీలో మురికి కాలువల నిర్మాణం, మంచినీటి సరఫరాకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ మాట్లాడుతూ గ్రామంలో బడి ఈడు పిల్లలను తప్పనిసరిగా పాఠశాలలకు పంపించాలని, బాల్య వివాహాలు జరగకుండా చూడాలని, బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని కోరారు.ఈ సమావేశంలో కమ్యూనిటీ ఆరోగ్య అధికారి రమాదేవి, భువనగిరి గ్రామీణ సహాయ ఉప పరిశీలకుడు అశోక్ ఆరోగ్య సమస్యలు, గ్రామాల్లో అంటరానితనం, మూడనమ్మకాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పల్లెర్ల బాలస్వామి, నారికడప నర్సింగరావు, గ్రామ పరిపాలన అధికారి బోట్ల రమేష్, వసతి గృహాల సంక్షేమ అధికారి నాగసైదులు, ఎంఎల్హెచ్పీ దివ్య, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు శ్రీనివాస్, ఉదయ్, సాయమ్మ, పోచమ్మ, సంతోష్, కిషన్, పద్మ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి