Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:04 AM

చరిత్ర సృష్టించిన సీఎం రేవంత్...దేశంలోనే తోలి సీఎంగా

చరిత్ర సృష్టించిన సీఎం రేవంత్...దేశంలోనే తోలి సీఎంగా

చరిత్ర సృష్టించిన సీఎం రేవంత్...దేశంలోనే తోలి సీఎంగా
January 19, 2026 09:17 PM 191 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రాష్ట్ర ప్రధాన స్థానికం ప్రతినిధి:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ రాజకీయాల్లో ఒక అరుదైన ఘనతను సాధించనున్నారు. సుదూర అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలోని కెన్నడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన “లీడర్‌షిప్ 21వ శతాబ్దం” అనే ప్రోగ్రాంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా హార్వర్డ్ యూనివర్సిటీ ఆయనను ఈ ప్రోగ్రామ్‌లో ఎన్‌రోల్‌ అయ్యారని అధికారికంగా ప్రకటించింది.స్వతంత్ర భారతదేశంలో ఈ ఘనతను సాధించిన మొదటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్‌లో ఆయనకు జనవరి 25 నుంచి 30 వరకు తరగతులు ఉండనున్నాయి. అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రం, కేంబ్రిడ్జ్ నగరంలో చెయ్యబడే ఈ తరగతుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా హాజరు కానున్నారు.ఈ ప్రోగ్రామ్, ప్రభుత్వ విధానాలు, నాయకత్వం మరియు గ్లోబల్ సమస్యలకు సమాధానాలు ఇవ్వడంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యొక్క అంతర్జాతీయ పరిజ్ఞానంని మరింత బలోపేతం చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఆయన ఈ తరగతుల ద్వారా సేకరించబోయే అనుభవాలు, భవిష్యత్తులో రాష్ట్ర పాలనలో మరింత సమర్థత కలిగించడంలో కీలకంగా ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు.హార్వర్డ్ వంటి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన వేదికపై పాల్గొనే మొదటి భారతీయ ముఖ్యమంత్రి అనే ఘనతతో రేవంత్ రెడ్డి రాజకీయ మరియు విద్యా రంగాల్లో కొత్త మైలురాయిని స్థాపించబోతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News