Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:18 PM

చరిత్ర సృష్టించిన సీఎం రేవంత్...దేశంలోనే తోలి సీఎంగా

చరిత్ర సృష్టించిన సీఎం రేవంత్...దేశంలోనే తోలి సీఎంగా

చరిత్ర సృష్టించిన సీఎం రేవంత్...దేశంలోనే తోలి సీఎంగా
January 19, 2026 09:17 PM 176 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రాష్ట్ర ప్రధాన స్థానికం ప్రతినిధి:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ రాజకీయాల్లో ఒక అరుదైన ఘనతను సాధించనున్నారు. సుదూర అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలోని కెన్నడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన “లీడర్‌షిప్ 21వ శతాబ్దం” అనే ప్రోగ్రాంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా హార్వర్డ్ యూనివర్సిటీ ఆయనను ఈ ప్రోగ్రామ్‌లో ఎన్‌రోల్‌ అయ్యారని అధికారికంగా ప్రకటించింది.స్వతంత్ర భారతదేశంలో ఈ ఘనతను సాధించిన మొదటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్‌లో ఆయనకు జనవరి 25 నుంచి 30 వరకు తరగతులు ఉండనున్నాయి. అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రం, కేంబ్రిడ్జ్ నగరంలో చెయ్యబడే ఈ తరగతుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా హాజరు కానున్నారు.ఈ ప్రోగ్రామ్, ప్రభుత్వ విధానాలు, నాయకత్వం మరియు గ్లోబల్ సమస్యలకు సమాధానాలు ఇవ్వడంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యొక్క అంతర్జాతీయ పరిజ్ఞానంని మరింత బలోపేతం చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఆయన ఈ తరగతుల ద్వారా సేకరించబోయే అనుభవాలు, భవిష్యత్తులో రాష్ట్ర పాలనలో మరింత సమర్థత కలిగించడంలో కీలకంగా ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు.హార్వర్డ్ వంటి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన వేదికపై పాల్గొనే మొదటి భారతీయ ముఖ్యమంత్రి అనే ఘనతతో రేవంత్ రెడ్డి రాజకీయ మరియు విద్యా రంగాల్లో కొత్త మైలురాయిని స్థాపించబోతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News