చరిత్రలో మరుగునపడిన ‘సర్దార్ సర్వాయి పాపన్న గుండు’
చరిత్రలో మరుగునపడిన ‘సర్దార్ సర్వాయి పాపన్న గుండు’
Editor Desk
సర్వాయి పాపన్న అడుగుజాడల్లో నాగిరెడ్డిపల్లి బండరాయి
గోల్కొండ ప్రయాణాల్లో విశ్రాంతి కేంద్రమైన పాపన్నగుండు
స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
చాలామందికి తెలియని ఒక చారిత్రక ఆనవాళ్లుగా ‘సర్దార్ సర్వాయి పాపన్న గుండు’ ఇప్పటికీ మౌనంగా నిలిచింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ శివారులో, రమణానంద ఆశ్రమ పరిసరాల్లో ఉన్న ఈ బండరాయి ఒకప్పుడు సర్వాయి పాపన్న గౌడ్కు ఆశ్రయ స్థలంగా ఉపయోగపడినట్లు పెద్దలు చెబుతున్నారు.తాడిచెట్టు ఎత్తు ఉన్న ఈ భారీ బండరాయి, ఒకప్పుడు విస్తారమైన అడవిగా ఉన్న ఈ ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపుగా ఉండేదని స్థానికులు వివరిస్తున్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తన సైన్యంతో ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకునేవాడని, ఉడుంతో సహాయంతో బండరాయి పైకి ఎక్కి కొంతసేపు గడిపేవాడని పాత తరం మనుషులు ఇప్పటికీ చెప్పుకుంటున్నారు.ఇక ఈ బండరాయి నుంచి సుమారు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న పూర్ణగిరి దేవాలయం కూడా సర్వాయి పాపన్న చరిత్రతో అనుసంధానమై ఉందని కథనాలు ఉన్నాయి. వరంగల్ జిల్లా కిళాశాపురం నుంచి గోల్కొండకు గుర్రాలపై ప్రయాణించే సమయంలో, సర్వాయి పాపన్న తన సైన్యంతో కలిసి పూర్ణగిరిలోని స్వయంభు శ్రీ శ్రీ సుదర్శన లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ముందుకు సాగేవాడని పెద్దలు గుర్తుచేస్తున్నారు.
కాల ప్రవాహంలో మరుగునపడుతున్న ఈ చారిత్రక ప్రదేశాలు, సర్వాయి పాపన్న పోరాట చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తూ నేటి తరానికి తెలియాల్సిన వారసత్వంగా నిలిచాయని స్థానిక చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.
l
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి