Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:51 PM

చరిత్రలో మరుగునపడిన ‘సర్దార్ సర్వాయి పాపన్న గుండు’

చరిత్రలో మరుగునపడిన ‘సర్దార్ సర్వాయి పాపన్న గుండు’

చరిత్రలో మరుగునపడిన ‘సర్దార్ సర్వాయి పాపన్న గుండు’
January 07, 2026 09:58 AM 345 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
సర్వాయి పాపన్న అడుగుజాడల్లో నాగిరెడ్డిపల్లి బండరాయి
గోల్కొండ ప్రయాణాల్లో విశ్రాంతి కేంద్రమైన పాపన్నగుండు

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

చాలామందికి తెలియని ఒక చారిత్రక ఆనవాళ్లుగా ‘సర్దార్ సర్వాయి పాపన్న గుండు’ ఇప్పటికీ మౌనంగా నిలిచింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ శివారులో, రమణానంద ఆశ్రమ పరిసరాల్లో ఉన్న ఈ బండరాయి ఒకప్పుడు సర్వాయి పాపన్న గౌడ్‌కు ఆశ్రయ స్థలంగా ఉపయోగపడినట్లు పెద్దలు చెబుతున్నారు.తాడిచెట్టు ఎత్తు ఉన్న ఈ భారీ బండరాయి, ఒకప్పుడు విస్తారమైన అడవిగా ఉన్న ఈ ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపుగా ఉండేదని స్థానికులు వివరిస్తున్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తన సైన్యంతో ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకునేవాడని, ఉడుంతో సహాయంతో బండరాయి పైకి ఎక్కి కొంతసేపు గడిపేవాడని పాత తరం మనుషులు ఇప్పటికీ చెప్పుకుంటున్నారు.ఇక ఈ బండరాయి నుంచి సుమారు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న పూర్ణగిరి దేవాలయం కూడా సర్వాయి పాపన్న చరిత్రతో అనుసంధానమై ఉందని కథనాలు ఉన్నాయి. వరంగల్ జిల్లా కిళాశాపురం నుంచి గోల్కొండకు గుర్రాలపై ప్రయాణించే సమయంలో, సర్వాయి పాపన్న తన సైన్యంతో కలిసి పూర్ణగిరిలోని స్వయంభు శ్రీ శ్రీ సుదర్శన లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ముందుకు సాగేవాడని పెద్దలు గుర్తుచేస్తున్నారు.

కాల ప్రవాహంలో మరుగునపడుతున్న ఈ చారిత్రక ప్రదేశాలు, సర్వాయి పాపన్న పోరాట చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తూ నేటి తరానికి తెలియాల్సిన వారసత్వంగా నిలిచాయని స్థానిక చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.

l

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News