Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 09:13 AM

చరిత్రలో మరుగునపడిన ‘సర్దార్ సర్వాయి పాపన్న గుండు’

చరిత్రలో మరుగునపడిన ‘సర్దార్ సర్వాయి పాపన్న గుండు’

చరిత్రలో మరుగునపడిన ‘సర్దార్ సర్వాయి పాపన్న గుండు’
January 07, 2026 09:58 AM 337 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
సర్వాయి పాపన్న అడుగుజాడల్లో నాగిరెడ్డిపల్లి బండరాయి
గోల్కొండ ప్రయాణాల్లో విశ్రాంతి కేంద్రమైన పాపన్నగుండు

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

చాలామందికి తెలియని ఒక చారిత్రక ఆనవాళ్లుగా ‘సర్దార్ సర్వాయి పాపన్న గుండు’ ఇప్పటికీ మౌనంగా నిలిచింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ శివారులో, రమణానంద ఆశ్రమ పరిసరాల్లో ఉన్న ఈ బండరాయి ఒకప్పుడు సర్వాయి పాపన్న గౌడ్‌కు ఆశ్రయ స్థలంగా ఉపయోగపడినట్లు పెద్దలు చెబుతున్నారు.తాడిచెట్టు ఎత్తు ఉన్న ఈ భారీ బండరాయి, ఒకప్పుడు విస్తారమైన అడవిగా ఉన్న ఈ ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపుగా ఉండేదని స్థానికులు వివరిస్తున్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తన సైన్యంతో ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకునేవాడని, ఉడుంతో సహాయంతో బండరాయి పైకి ఎక్కి కొంతసేపు గడిపేవాడని పాత తరం మనుషులు ఇప్పటికీ చెప్పుకుంటున్నారు.ఇక ఈ బండరాయి నుంచి సుమారు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న పూర్ణగిరి దేవాలయం కూడా సర్వాయి పాపన్న చరిత్రతో అనుసంధానమై ఉందని కథనాలు ఉన్నాయి. వరంగల్ జిల్లా కిళాశాపురం నుంచి గోల్కొండకు గుర్రాలపై ప్రయాణించే సమయంలో, సర్వాయి పాపన్న తన సైన్యంతో కలిసి పూర్ణగిరిలోని స్వయంభు శ్రీ శ్రీ సుదర్శన లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ముందుకు సాగేవాడని పెద్దలు గుర్తుచేస్తున్నారు.

కాల ప్రవాహంలో మరుగునపడుతున్న ఈ చారిత్రక ప్రదేశాలు, సర్వాయి పాపన్న పోరాట చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తూ నేటి తరానికి తెలియాల్సిన వారసత్వంగా నిలిచాయని స్థానిక చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.

l

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News