చనుబండలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ: నూతన సంవత్సరానికి ముందే లబ్ధిదారులకు ఊరట
చనుబండలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ: నూతన సంవత్సరానికి ముందే లబ్ధిదారులకు ఊరట
స్థానికం బృందం
ఏలూరు సానికం ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో బుధవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చనుబండ పీఏసీఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.
నూతన సంవత్సరానికి ఒక రోజు ముందే, 31వ తేదీన పింఛన్లను పంపిణీ చేయించడం కూటమి ప్రభుత్వ ప్రత్యేకతగా ఆయన పేర్కొన్నారు. ఇది సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వ ఔన్నత్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు సమయానికి అందేలా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
ఈ సందర్భంగా రెండు కిడ్నీలు పాడై డయాలసిస్ చికిత్స పొందుతున్న కటకం సత్యనారాయణకు నూతనంగా మంజూరైన రూ.10,000 పింఛన్ను అందజేశారు. తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి ప్రభుత్వ సహాయం అండగా నిలుస్తోందని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు చీదిరాల మారేశ్వర రావు, కందుల కృష్ణ, గుడిమళ్ల బ్రహ్మయ్య, బన్నే వెంకటేశ్వర రావు, కంచు శ్రీను, గవర వెంకటేశ్వర రావు, గవర నరసింహారావు, జోగు మహేష్, కొండా శోభన్ బాబు పాల్గొన్నారు. అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్ మురళీ మోహన్, వీఆర్ఓ శోభన్ బాబు, విస్సంపల్లి రాజా తదితరులు హాజరయ్యారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి