Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 06:23 AM

చనుబండలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ: నూతన సంవత్సరానికి ముందే లబ్ధిదారులకు ఊరట

చనుబండలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ: నూతన సంవత్సరానికి ముందే లబ్ధిదారులకు ఊరట

చనుబండలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ: నూతన సంవత్సరానికి ముందే లబ్ధిదారులకు ఊరట
December 31, 2025 04:03 PM 62 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఏలూరు సానికం ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో బుధవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చనుబండ పీఏసీఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.

నూతన సంవత్సరానికి ఒక రోజు ముందే, 31వ తేదీన పింఛన్లను పంపిణీ చేయించడం కూటమి ప్రభుత్వ ప్రత్యేకతగా ఆయన పేర్కొన్నారు. ఇది సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వ ఔన్నత్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు సమయానికి అందేలా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

ఈ సందర్భంగా రెండు కిడ్నీలు పాడై డయాలసిస్ చికిత్స పొందుతున్న కటకం సత్యనారాయణకు నూతనంగా మంజూరైన రూ.10,000 పింఛన్‌ను అందజేశారు. తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి ప్రభుత్వ సహాయం అండగా నిలుస్తోందని నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు చీదిరాల మారేశ్వర రావు, కందుల కృష్ణ, గుడిమళ్ల బ్రహ్మయ్య, బన్నే వెంకటేశ్వర రావు, కంచు శ్రీను, గవర వెంకటేశ్వర రావు, గవర నరసింహారావు, జోగు మహేష్, కొండా శోభన్ బాబు పాల్గొన్నారు. అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్ మురళీ మోహన్, వీఆర్ఓ శోభన్ బాబు, విస్సంపల్లి రాజా తదితరులు హాజరయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News