Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:46 PM

చలాన్ పడితే నేరుగా ఖాతా నుంచి కట్? ఆటో డెబిట్‌పై ఆలోచన

చలాన్ పడితే నేరుగా ఖాతా నుంచి కట్? ఆటో డెబిట్‌పై ఆలోచన

చలాన్ పడితే నేరుగా ఖాతా నుంచి కట్? ఆటో డెబిట్‌పై ఆలోచన
February 10, 2026 10:54 AM 194 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తెలంగాణలో ట్రాఫిక్ నిబంధనల అమలును మరింత కఠినంగా చేపట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని పరిశీలిస్తోంది. వాహన రిజిస్ట్రేషన్ సమయంలోనే వాహనదారుల బ్యాంకు ఖాతా వివరాలను సేకరించి, ట్రాఫిక్ చలాన్ విధించినప్పుడు నేరుగా ఖాతా నుంచి జరిమానా మొత్తం కట్ అయ్యేలా ‘ఆటో డెబిట్’ వ్యవస్థను అమల్లోకి తీసుకురావాలనే ప్రతిపాదనపై చర్చ జరుగుతోంది.ఈ విధానం అమలైతే ట్రాఫిక్ చలానాల వసూలు సులభమవుతుందని, జరిమానాల పెండింగ్ సమస్య తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన వెంటనే జరిమానా ఆటోమేటిక్‌గా వసూలు కావడంతో ట్రాఫిక్ నియమాల పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.అయితే ఈ ప్రతిపాదనపై వాహనదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తమ బ్యాంకు ఖాతాలపై ప్రత్యక్ష నియంత్రణ పెరుగుతుందనే భయం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అనవసరంగా లేదా తప్పిదాల కారణంగా జరిమానాలు కట్ అయితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆందోళన కూడా ఉంది.ఇదిలా ఉండగా, రవాణా శాఖ అధికారులు ఈ అంశంపై స్పష్టత ఇస్తున్నారు. ప్రస్తుతం వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో బ్యాంకు ఖాతాలను లింక్ చేసే విధానం లేదని, ఆటో డెబిట్ విధానం కేవలం ఆలోచన దశలోనే ఉందని తెలిపారు. ప్రజల అభిప్రాయాలు, న్యాయపరమైన అంశాలు, గోప్యతా పరిరక్షణ వంటి అంశాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News