Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:54 AM

చలాన్ పడితే నేరుగా ఖాతా నుంచి కట్? ఆటో డెబిట్‌పై ఆలోచన

చలాన్ పడితే నేరుగా ఖాతా నుంచి కట్? ఆటో డెబిట్‌పై ఆలోచన

చలాన్ పడితే నేరుగా ఖాతా నుంచి కట్? ఆటో డెబిట్‌పై ఆలోచన
February 10, 2026 10:54 AM 205 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తెలంగాణలో ట్రాఫిక్ నిబంధనల అమలును మరింత కఠినంగా చేపట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని పరిశీలిస్తోంది. వాహన రిజిస్ట్రేషన్ సమయంలోనే వాహనదారుల బ్యాంకు ఖాతా వివరాలను సేకరించి, ట్రాఫిక్ చలాన్ విధించినప్పుడు నేరుగా ఖాతా నుంచి జరిమానా మొత్తం కట్ అయ్యేలా ‘ఆటో డెబిట్’ వ్యవస్థను అమల్లోకి తీసుకురావాలనే ప్రతిపాదనపై చర్చ జరుగుతోంది.ఈ విధానం అమలైతే ట్రాఫిక్ చలానాల వసూలు సులభమవుతుందని, జరిమానాల పెండింగ్ సమస్య తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన వెంటనే జరిమానా ఆటోమేటిక్‌గా వసూలు కావడంతో ట్రాఫిక్ నియమాల పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.అయితే ఈ ప్రతిపాదనపై వాహనదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తమ బ్యాంకు ఖాతాలపై ప్రత్యక్ష నియంత్రణ పెరుగుతుందనే భయం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అనవసరంగా లేదా తప్పిదాల కారణంగా జరిమానాలు కట్ అయితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆందోళన కూడా ఉంది.ఇదిలా ఉండగా, రవాణా శాఖ అధికారులు ఈ అంశంపై స్పష్టత ఇస్తున్నారు. ప్రస్తుతం వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో బ్యాంకు ఖాతాలను లింక్ చేసే విధానం లేదని, ఆటో డెబిట్ విధానం కేవలం ఆలోచన దశలోనే ఉందని తెలిపారు. ప్రజల అభిప్రాయాలు, న్యాయపరమైన అంశాలు, గోప్యతా పరిరక్షణ వంటి అంశాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News