చదువుతో పాటు క్రీడలు అవసరం… విద్యార్థులకు ప్రోత్సాహం అందించిన జనసేన నాయకులు తల్లాడ రామకృష్ణ.
చదువుతో పాటు క్రీడలు అవసరం… విద్యార్థులకు ప్రోత్సాహం అందించిన జనసేన నాయకులు తల్లాడ రామకృష్ణ.
స్థానికం బృందం
చదువుతోపాటు ఆటలే విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి మార్గం
ఏలూరు స్థానికం రిపోర్టర్ గడ్డం జగన్మోహన్ రెడ్డి.
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం నరసింహారావుపాలెం పంచాయతీ సి.గుడిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆటల సౌకర్యాలు లేకపోవడంతో గ్రామ జనసేన నాయకులు తల్లాడ రామకృష్ణ ముందడుగు వేశారు. విద్యార్థులు ఆడుకునేందుకు అవసరమైన వాలీబాల్ కిట్ను చాట్రాయి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డి. రామకృష్ణ చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు విద్యార్థుల శారీరక, మానసిక దృఢత్వానికి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని తెలిపారు. క్రీడలకు ప్రోత్సాహం అందిస్తున్న జనసేన నాయకులు తల్లాడ రామకృష్ణను ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అంగిడి బక్కయ్యతో పాటు ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు. పాఠశాలలో క్రీడా వాతావరణం ఏర్పడేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి