Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:34 AM

చదువుతో పాటు క్రీడలు అవసరం… విద్యార్థులకు ప్రోత్సాహం అందించిన జనసేన నాయకులు తల్లాడ రామకృష్ణ.

చదువుతో పాటు క్రీడలు అవసరం… విద్యార్థులకు ప్రోత్సాహం అందించిన జనసేన నాయకులు తల్లాడ రామకృష్ణ.

చదువుతో పాటు క్రీడలు అవసరం… విద్యార్థులకు ప్రోత్సాహం అందించిన జనసేన నాయకులు తల్లాడ రామకృష్ణ.
31-12-2025 89 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చదువుతోపాటు ఆటలే విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి మార్గం

ఏలూరు స్థానికం రిపోర్టర్ గడ్డం జగన్మోహన్ రెడ్డి.

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం నరసింహారావుపాలెం పంచాయతీ సి.గుడిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆటల సౌకర్యాలు లేకపోవడంతో గ్రామ జనసేన నాయకులు తల్లాడ రామకృష్ణ ముందడుగు వేశారు. విద్యార్థులు ఆడుకునేందుకు అవసరమైన వాలీబాల్ కిట్‌ను చాట్రాయి సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డి. రామకృష్ణ చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ రామకృష్ణ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు విద్యార్థుల శారీరక, మానసిక దృఢత్వానికి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని తెలిపారు. క్రీడలకు ప్రోత్సాహం అందిస్తున్న జనసేన నాయకులు తల్లాడ రామకృష్ణను ఆయన అభినందించారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అంగిడి బక్కయ్యతో పాటు ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు. పాఠశాలలో క్రీడా వాతావరణం ఏర్పడేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.

Sthanikam

చదువుతో పాటు క్రీడలు అవసరం… విద్యార్థులకు ప్రోత్సాహం అందించిన జనసేన నాయకులు తల్లాడ రామకృష్ణ.

Article Image

చదువుతోపాటు ఆటలే విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి మార్గం

ఏలూరు స్థానికం రిపోర్టర్ గడ్డం జగన్మోహన్ రెడ్డి.

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం నరసింహారావుపాలెం పంచాయతీ సి.గుడిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆటల సౌకర్యాలు లేకపోవడంతో గ్రామ జనసేన నాయకులు తల్లాడ రామకృష్ణ ముందడుగు వేశారు. విద్యార్థులు ఆడుకునేందుకు అవసరమైన వాలీబాల్ కిట్‌ను చాట్రాయి సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డి. రామకృష్ణ చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ రామకృష్ణ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు విద్యార్థుల శారీరక, మానసిక దృఢత్వానికి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని తెలిపారు. క్రీడలకు ప్రోత్సాహం అందిస్తున్న జనసేన నాయకులు తల్లాడ రామకృష్ణను ఆయన అభినందించారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అంగిడి బక్కయ్యతో పాటు ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు. పాఠశాలలో క్రీడా వాతావరణం ఏర్పడేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News