Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 07:39 AM

చైనీస్ మాంజాపై సీపీ సజ్జనార్ కఠిన హెచ్చరికలు… విక్రయం, నిల్వకు క్రిమినల్ కేసులే

చైనీస్ మాంజాపై సీపీ సజ్జనార్ కఠిన హెచ్చరికలు… విక్రయం, నిల్వకు క్రిమినల్ కేసులే

చైనీస్ మాంజాపై సీపీ సజ్జనార్ కఠిన హెచ్చరికలు… విక్రయం, నిల్వకు క్రిమినల్ కేసులే
06-01-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
హైదరాబాద్ స్థానికం ప్రతినిధి

చైనీస్ మాంజా వల్ల అమాయకుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చైనీస్ మాంజా విక్రయం, నిల్వ, రవాణాపై ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ కొందరు అక్రమంగా కొనసాగిస్తుండటాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు.చైనీస్ మాంజాను విక్రయించినా, నిల్వ చేసినా సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నగరవ్యాప్తంగా షాపులు, గోదాములపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారని, ఎక్కడైనా చైనీస్ మాంజా లభిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. అక్రమంగా మాంజాను తరలించే ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.చైనీస్ మాంజాతో మెడ, గొంతు, ముఖం వద్ద తీవ్ర గాయాలు జరిగి ప్రాణాపాయం ఏర్పడే ప్రమాదం ఉందని సీపీ గుర్తు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి ప్రమాదకరమైన మాంజాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించవద్దని సూచించారు.చైనీస్ మాంజా విక్రయం లేదా వినియోగం గురించి సమాచారం ఉంటే వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని లేదా వాట్సాప్ నంబర్ 94906 16555కు ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు తెలిపారు. ప్రజల సహకారంతోనే ప్రమాదాలను అరికట్టగలమని సీపీ సజ్జనార్ పిలుపునిచ్చారు

Sthanikam

చైనీస్ మాంజాపై సీపీ సజ్జనార్ కఠిన హెచ్చరికలు… విక్రయం, నిల్వకు క్రిమినల్ కేసులే

Article Image
హైదరాబాద్ స్థానికం ప్రతినిధి

చైనీస్ మాంజా వల్ల అమాయకుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చైనీస్ మాంజా విక్రయం, నిల్వ, రవాణాపై ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ కొందరు అక్రమంగా కొనసాగిస్తుండటాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు.చైనీస్ మాంజాను విక్రయించినా, నిల్వ చేసినా సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నగరవ్యాప్తంగా షాపులు, గోదాములపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారని, ఎక్కడైనా చైనీస్ మాంజా లభిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. అక్రమంగా మాంజాను తరలించే ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.చైనీస్ మాంజాతో మెడ, గొంతు, ముఖం వద్ద తీవ్ర గాయాలు జరిగి ప్రాణాపాయం ఏర్పడే ప్రమాదం ఉందని సీపీ గుర్తు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి ప్రమాదకరమైన మాంజాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించవద్దని సూచించారు.చైనీస్ మాంజా విక్రయం లేదా వినియోగం గురించి సమాచారం ఉంటే వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని లేదా వాట్సాప్ నంబర్ 94906 16555కు ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు తెలిపారు. ప్రజల సహకారంతోనే ప్రమాదాలను అరికట్టగలమని సీపీ సజ్జనార్ పిలుపునిచ్చారు

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News