చైనీస్ మాంజాపై సీపీ సజ్జనార్ కఠిన హెచ్చరికలు… విక్రయం, నిల్వకు క్రిమినల్ కేసులే
చైనీస్ మాంజాపై సీపీ సజ్జనార్ కఠిన హెచ్చరికలు… విక్రయం, నిల్వకు క్రిమినల్ కేసులే
స్థానికం బృందం
హైదరాబాద్ స్థానికం ప్రతినిధి
చైనీస్ మాంజా వల్ల అమాయకుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చైనీస్ మాంజా విక్రయం, నిల్వ, రవాణాపై ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ కొందరు అక్రమంగా కొనసాగిస్తుండటాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు.చైనీస్ మాంజాను విక్రయించినా, నిల్వ చేసినా సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నగరవ్యాప్తంగా షాపులు, గోదాములపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారని, ఎక్కడైనా చైనీస్ మాంజా లభిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. అక్రమంగా మాంజాను తరలించే ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.చైనీస్ మాంజాతో మెడ, గొంతు, ముఖం వద్ద తీవ్ర గాయాలు జరిగి ప్రాణాపాయం ఏర్పడే ప్రమాదం ఉందని సీపీ గుర్తు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి ప్రమాదకరమైన మాంజాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించవద్దని సూచించారు.చైనీస్ మాంజా విక్రయం లేదా వినియోగం గురించి సమాచారం ఉంటే వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని లేదా వాట్సాప్ నంబర్ 94906 16555కు ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు తెలిపారు. ప్రజల సహకారంతోనే ప్రమాదాలను అరికట్టగలమని సీపీ సజ్జనార్ పిలుపునిచ్చారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి