Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లోకి దారి తప్పి వచ్చిన జింక.. అప్రమత్తమైన అటవీశాఖ! నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 06:57 AM

చైనీస్ మాంజాపై సీపీ సజ్జనార్ కఠిన హెచ్చరికలు… విక్రయం, నిల్వకు క్రిమినల్ కేసులే

చైనీస్ మాంజాపై సీపీ సజ్జనార్ కఠిన హెచ్చరికలు… విక్రయం, నిల్వకు క్రిమినల్ కేసులే

చైనీస్ మాంజాపై సీపీ సజ్జనార్ కఠిన హెచ్చరికలు… విక్రయం, నిల్వకు క్రిమినల్ కేసులే
January 06, 2026 04:53 AM 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
హైదరాబాద్ స్థానికం ప్రతినిధి

చైనీస్ మాంజా వల్ల అమాయకుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చైనీస్ మాంజా విక్రయం, నిల్వ, రవాణాపై ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ కొందరు అక్రమంగా కొనసాగిస్తుండటాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు.చైనీస్ మాంజాను విక్రయించినా, నిల్వ చేసినా సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నగరవ్యాప్తంగా షాపులు, గోదాములపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారని, ఎక్కడైనా చైనీస్ మాంజా లభిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. అక్రమంగా మాంజాను తరలించే ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.చైనీస్ మాంజాతో మెడ, గొంతు, ముఖం వద్ద తీవ్ర గాయాలు జరిగి ప్రాణాపాయం ఏర్పడే ప్రమాదం ఉందని సీపీ గుర్తు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి ప్రమాదకరమైన మాంజాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించవద్దని సూచించారు.చైనీస్ మాంజా విక్రయం లేదా వినియోగం గురించి సమాచారం ఉంటే వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని లేదా వాట్సాప్ నంబర్ 94906 16555కు ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు తెలిపారు. ప్రజల సహకారంతోనే ప్రమాదాలను అరికట్టగలమని సీపీ సజ్జనార్ పిలుపునిచ్చారు

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News