చాట్రాయిలో సహకార సంఘ ఉద్యోగుల రిలే నిరాహారదీక్షలు
చాట్రాయిలో సహకార సంఘ ఉద్యోగుల రిలే నిరాహారదీక్షలు
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా స్థానికం ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి
చాట్రాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ పిలుపుమేరకు 05.01.2026 నుండి 09.01.2026 వరకు రిలే నిరహార దీక్షలు లో భాగంగా ఈరోజు ఏలూరు జిల్లా, చాట్రాయి కేంద్ర సహకార బ్యాంక్ బ్రాంచ్ పరిధిలోని ఏడు పిఏసిఎస్. సీఈవోలు మరియు సిబ్బంది రిలే నిరహార దీక్ష కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా చాట్రాయి బ్రాంచ్ చీఫ్ మేనేజర్ జోనుబోయిన శ్రీనివాస్, మేనేజర్ శివరాత్రి రాం శంకర్ మరియు సిబ్బంది సంఘీభావం తెలియజేసారు. సందర్భంగా తుమ్మగూడెం సంఘ కార్యదర్శి చిమట వరప్రసాద్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం నెరవేర్చే వరకూ ఈ నిరహార దీక్షలు ఆపమని, యూనియన్ నేతలు పిలుపు మేరకు ఎంత దూరం అయినా వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు బూరుగుగూడెం ఉమ్మడి సీతారాములు చిన్నంపేట వేముల రవి, నరసింహారావుపాలెం పాకాల దినేష్, చనుబండ అనిశెట్టి వీర వెంకటేశ్వరరావు, పోలవరం నిడదవోలు శ్రీకాంత్, చాట్రాయి తుపాకుల కనకారావు, మరియు సంఘ సిబ్బంది బడుగు నరేష్, దేవరపల్లి రవీంద్రనాథ్, ధర్మరాజుల దుర్గారావు, తానంకి శ్రీను, కుమార రాజా, పత్తిపాటి కుటుంబరావు తదితర సిబ్బంది పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి