PRINT TIME: February 28, 2026 02:10 PM
బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్ – హైదరాబాద్లో చికిత్స
బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్ – హైదరాబాద్లో చికిత్స
February 28, 2026 12:35 PM
21 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమయ్యారు.
ప్రాథమిక చికిత్స అనంతరం ఆయనను అత్యవసరంగా హైదరాబాద్కు తరలించారు. ప్రస్తుతం హైదరాబాద్లోని సిటీ న్యూరో సెంటర్ లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. నిన్న రాత్రి ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం.
వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం బొత్స ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని తెలిపారు. అయితే పూర్తిస్థాయి వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి.
బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందన్న వార్త తెలిసిన వెంటనే వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్కు చేరుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, నాయకులు ఆకాంక్షిస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి