Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:32 AM

బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్ – హైదరాబాద్‌లో చికిత్స

బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్ – హైదరాబాద్‌లో చికిత్స

బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్ – హైదరాబాద్‌లో చికిత్స
28-02-2026 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమయ్యారు.

ప్రాథమిక చికిత్స అనంతరం ఆయనను అత్యవసరంగా హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. నిన్న రాత్రి ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం.

వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం బొత్స ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని తెలిపారు. అయితే పూర్తిస్థాయి వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి.

బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందన్న వార్త తెలిసిన వెంటనే వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, నాయకులు ఆకాంక్షిస్తున్నారు.

Sthanikam

బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్ – హైదరాబాద్‌లో చికిత్స

Article Image

వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమయ్యారు.

ప్రాథమిక చికిత్స అనంతరం ఆయనను అత్యవసరంగా హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. నిన్న రాత్రి ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం.

వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం బొత్స ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని తెలిపారు. అయితే పూర్తిస్థాయి వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి.

బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందన్న వార్త తెలిసిన వెంటనే వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, నాయకులు ఆకాంక్షిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News