Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:58 PM

బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్ – హైదరాబాద్‌లో చికిత్స

బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్ – హైదరాబాద్‌లో చికిత్స

బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్ – హైదరాబాద్‌లో చికిత్స
February 28, 2026 12:35 PM 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమయ్యారు.

ప్రాథమిక చికిత్స అనంతరం ఆయనను అత్యవసరంగా హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. నిన్న రాత్రి ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం.

వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం బొత్స ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని తెలిపారు. అయితే పూర్తిస్థాయి వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి.

బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందన్న వార్త తెలిసిన వెంటనే వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, నాయకులు ఆకాంక్షిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News