బూరుగుగూడెం గ్రామానికి చెందిన ముక్కాల పవని అలేఖ్య గణతంత్ర దినోత్సవ పరేడ్ కు ఎన్ఎస్ఎస్ వాలంటీర్ ఎంపిక
బూరుగుగూడెం గ్రామానికి చెందిన ముక్కాల పవని అలేఖ్య గణతంత్ర దినోత్సవ పరేడ్ కు ఎన్ఎస్ఎస్ వాలంటీర్ ఎంపిక
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామానికి చెందిన వాసి ముక్కాల పవని అలేఖ్య గణతంత్ర దినోత్సవ పరేడ్ కు ఎన్ఎస్ఎస్ వాలంటీర్ ఎంపిక
చాట్రాయి జనవరి 26(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి)
జనవరి 26న ఢిల్లీలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ పరేడు ఎన్ఎస్ఎస్ (NSS) విభాగానికి చెందిన పవని అలేఖ్య ఎంపిక కావడం విశేషంగా నిలిచింది.
సికింద్రాబాద్ లోని వెస్ట్ మారేడ్ పల్లి ప్రాంతానికి చెందిన ఆమె, సీఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నాలుగో సంవత్సరం బీటెక్ చదువుతోంది వీరి తల్లిదండ్రుల స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామం తండ్రి ముక్కాల రవీంద్ర రెడ్డి తల్లి వాణి వీరు ఉద్యోగ రీత్యా గత కొంత కాలంగా సికింద్రాబాద్ లో ఉంటున్నారు విద్యాభ్యాసంతో పాటు సేవాభావం,క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ఎన్ఎస్ఎస్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్న ప్రతిభకు గుర్తింపుగా ఈ అవకాశం లభించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
పవని అలేఖ్య సాధించిన ఈ ఘనత సీఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్న నాలుగో సంవత్సరం బీటెక్ విద్యార్థులందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. ముక్కాల రవీంద్ర రెడ్డి, వాణి రెడ్డి దంపతుల కుమార్తె అయినపవని అలేఖ్య జాతీయ వేదికపై తన ప్రతిభను చాటుకోవడం గర్వకారణమని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. చదువుతో పాటు సేవా భావనకు విలువ ఇస్తే ఉన్నత అవకాశాలు సాధ్యమని ఆమె విజయం చాటుతోందని కళాశాల వర్గాలు అభిప్రాయపడ్డాయి.
ఈ అవకాశం సాధించిన పవని అలేఖ్య కు స్వగ్రామమైన బూరుగుగూడెం గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి